.
అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ వంటి అగ్ర నటులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశమైంది.
మరికొందరు సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు భూములు లేదా హోటల్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ (AB Corp) ఇప్పటికే దాదాపు ₹90 కోట్ల విలువైన విభిన్న ప్లాట్లను కొనుగోలు చేశాడు. కేవలం నివాస స్థలాలే కాకుండా, తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ స్మారకార్థం ఒక సాంస్కృతిక కేంద్రం లేదా మెమోరియల్ ఏర్పాటు చేయడానికి వీలుగా ‘హరివంశ్ రాయ్ బచ్చన్ ట్రస్ట్’ ద్వారా కూడా ఆలయానికి కొద్ది దూరంలో భారీ స్థలాన్ని సేకరించాడు..
Ads
అమితాబ్, రణబీర్ కొనుగోలు చేసిన ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL)’ ప్రాజెక్ట్లోనే ముంబైకి చెందిన మరికొందరు ప్రముఖ నిర్మాతలు, వ్యాపారవేత్తలు కూడా నిశ్శబ్దంగా ప్లాట్లను బుక్ చేసుకున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. (ఇదే గ్రూప్నకు చెందిన అలీబాగ్ ప్రాజెక్ట్లో కృతి సనన్, కార్తీక్ ఆర్యన్ వంటి వారు కొనుగోలు చేయగా, వారి తదుపరి చూపు అయోధ్యపైనే ఉన్నట్లు తెలుస్తోంది).
కేవలం వ్యక్తులే కాకుండా ‘ది లీల ప్యాలెసెస్, హోటల్స్ & రిసార్ట్స్’ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ‘ది సరయూ’ ప్రాజెక్ట్లో 5 ఎకరాల్లో పూర్తి శాఖాహార (Pure Vegetarian) 7-స్టార్ లగ్జరీ హోటల్ను నిర్మిస్తున్నాయి. వీటితో పాటు తాజ్, రాడిసన్, ఐటిసి వంటి గ్రూపులు కూడా ఇక్కడ భారీగా స్థలాలను సేకరించి హోటల్స్ నిర్మిస్తున్నాయి.
అయోధ్య రియల్ ఎస్టేట్కు ఎందుకింత క్రేజ్? కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, అయోధ్య ఒక ‘హాట్ రియల్ ఎస్టేట్ గోల్డ్మైన్’ గా మారడానికి బలమైన ఆర్థిక, మౌలిక కారణాలు ఉన్నాయి:
రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యకు ఏడాదికి సగటున 5.75 కోట్ల మంది వచ్చేవారు. కానీ మందిర నిర్మాణం తర్వాత, ఒక్క 2025 జనవరి నుండి జూన్ మధ్య కాలంలోనే రికార్డు స్థాయిలో 23 కోట్ల మంది పర్యాటకులు అయోధ్యను సందర్శించారు. ఈ ఏడాది చివరికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు వసతి, లగ్జరీ సౌకర్యాల అవసరం ఉండటంతో భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోధ్యను గ్లోబల్ టూరిజం హబ్గా మార్చడానికి దాదాపు ₹85,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం (మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్) ఏర్పాటుతో కనెక్టివిటీ పెరిగింది. ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్, వెడల్పాటి ఎక్స్ప్రెస్వేలు, సరయూ నది ఘాట్ల ఆధునికీకరణ వంటివి ఇక్కడి రియల్ ఎస్టేట్ విలువను అమాంతం పెంచేశాయి.
రియల్ ఎస్టేట్ విశ్లేషణ సంస్థ ‘లియాసెస్ ఫోరాస్’ నివేదిక ప్రకారం, అయోధ్యలో ల్యాండ్ ప్రైసెస్ వార్షిక చక్రవృద్ది రేటు (CAGR) 19% ఉంది. రాబోయే 2035 నాటికి ఇది 25% కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మెట్రో నగరాల్లో స్టాగ్నెంట్ (నిలిచిపోయిన) అవుతున్న రియల్ ఎస్టేట్తో పోలిస్తే, ఇలాంటి ఆధ్యాత్మిక కారిడార్లలో లాభాలు (Returns) చాలా వేగంగా వస్తున్నాయి.
ప్రస్తుతం రణబీర్ కపూర్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో భూమి కొనుగోలు చేయడం కేవలం వ్యాపార పరంగానే కాకుండా, తన కెరీర్, ఫ్యామిలీ లెగసీకి ఒక సెంటిమెంట్గా భావించి ఆయన ఈ ఇన్వెస్ట్మెంట్ చేశాడు.
ఇంతకుముందు టైర్-2, టైర్-3 నగరాల్లో స్థలాలు కొనాలంటే డాక్యుమెంటేషన్, టైటిల్ క్లియరెన్స్ సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ వంటి కార్పొరేట్ సంస్థలు UP RERA నిబంధనలకు లోబడి, పూర్తి డిజిటల్ పద్ధతిలో టైటిల్ క్లియారిటీతో భూములను అమ్ముతుండటంతో ముంబై, ఢిల్లీ సెలబ్రిటీలు ఇక్కడి ప్రాజెక్టుల్లో ధైర్యంగా కోట్లు కుమ్మరిస్తున్నారు.
మొత్తానికి, ఒకప్పుడు కేవలం చిన్న ఆధ్యాత్మిక పట్టణంగా ఉన్న అయోధ్య.. ఇప్పుడు లండన్, వాటికన్ సిటీ, మక్కా తరహాలో గ్లోబల్ స్పిరిచువల్ క్యాపిటల్గా మారుతుండటమే ఈ క్రేజ్కు అసలు కారణం.
Share this Article