Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చెబితే నమ్మలేని పర్‌ఫెక్ట్ టెక్ వ్యూహం… అందుకే ఇజ్రాయిల్ అలా నిలబడగలిగింది…

September 19, 2024 by M S R

హాలీవుడ్ సినిమాలు చూసి ఇవేవో సినిమాలలో మాత్రమే సాధ్యమవుతాయిలే అనుకోవడం సహజం! కానీ అవే నిజంగా జరిగి వాటిని నేను రిపోర్ట్ చేస్తూ విశ్లేషణ చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు!

పుస్తకాలలో వ్రాసినట్లుగా నిజ జీవితంలో జరుగుతాయా? మన చుట్టూ నిత్యం జరిగే సంఘటనలని కొద్దిగా శ్రద్ధ పెట్టి గమనిస్తూ ఉంటే పుస్తకంలో రచయిత ఊహలు పూర్తిగా కాకపోయినా కొంతైనా వాస్తవం అనే అనిపిస్తాయి! కావాల్సిందల్లా కాస్తంత పరిశీలనాత్మక దృష్టి మరి కొంచెం సహనం!

*******
ఇజ్రాయేల్ గూఢచార సంస్థ మోస్సాద్ అచ్చంగా సినిమాలలో చూపినట్లుగానే తన ఆపరేషన్ ని పూర్తిచేసింది, కాదు ఇంకా చేస్తూనే ఉంది!

Ads

లెబనాన్ హిజబొల్లా Vs ఇజ్రాయేల్ మోస్సాద్!

గత మూడు రోజులుగా లెబనాన్ లో ఎక్కోడో ఒకచోట పేలుళ్ళు జరగడం తీవ్రగాయాలు అవడం లేదా చనిపోవడం జరుగుతూ వస్తున్నది. బాధితులు అందరూ హిజ్బొల్లా తీవ్రవాదులే!

1.పేలుళ్ళకి కారణం మెసేజెస్ పంపించే పేజర్లు (Peger ), మొబైల్ ఫోన్లు, వాకీ టాకీలు, వైర్లెస్ రేడియో సెట్లు, ఇలా కమ్యూనికేషన్ కోసం వాడే ప్రతిదీ పేలి పోతున్నాయి.

2. ఇంతకీ హెఙబొల్లా పేజర్లు ఎందుకు వాడడం మొదలు పెట్టింది? అఫ్కోర్స్ మొబైల్ ఫోన్లని మోస్సాద్ హ్యాక్ చేసి రహస్యంగా తమ సంభాషణలని వింటున్నది అనే అనుమానంతో!

********
అయితే హిజ్బోల్లా అనుమానాలకి ఆధారం ఉంది! పది రోజులక్రితం ఇరాన్ నుండి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు లెబనాన్ లోని హెజ్బొల్లా బేస్ కి వచ్చాయి. అది ఇజ్రాయేల్ సరిహద్దుకు దగ్గరలో ఉండడం వల్ల ప్రమాదం అని భావించిన హెఙబొల్లా నాయకులు ఇజ్రాయల్ సరిహద్దు నుండి దూరంగా మనుష్య సంచారం లేని రెండు కొండల మధ్య దట్టమైన అడివిలో గొడౌన్స్ కి తరలించింది!

హెజ్బొల్లా మొత్తం ఆయుధాలని తరలించిన రెండు రోజుల తరువాత ఇజ్రాయేల్ కి చెందిన రెండు F-15 జెట్ ఫైటర్స్ మరో రెండు F-16 జెట్ ఫైటర్స్ రెండు గోడౌన్స్ ని పేల్చివేసాయి! ఇరాన్ నుండి వచ్చిన ఆయుధాలు మొత్తం గోడౌన్స్ లోకి తరలించే వరకూ ఆగి, ఇజ్రాయేల్ దాడి చేసింది!

ఆయుధాలు, పేలుడు పదార్ధాలు పేలిపోయి రెండు రోజుల వరకూ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి అంటే ఎంత భారీగా నిల్వలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు! ఈ ఘటన తరువాత హెజ్బొల్లా 4G, 5G లతో పనిచేసే మొబైల్ ఫోన్లని వాడడం ఆపేసింది. అంతకు నెల రోజుల ముందే ముందు జాగ్రత్తగా 2nd జెనరేషన్ వి అయిన పేజర్ల కోసం ఒక ఇరాన్ కి చెందిన సంస్థ ద్వారా ఆర్డర్ పెట్టింది!

ఇరాన్ సంస్థ తైవాన్ కి ఆర్డర్ పెట్టింది పేజర్స్ కోసం! తైవాన్ కి చెందిన గోల్డ్ అపోలో ( Gold Apolo Co.) వీటిని సప్లై చేసింది అని మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తున్నది. అంటే ఆర్డర్ చేసిన సంస్థ ఇరాన్ దేశానికి చెందినది. అవి లెబనాన్ కి చేరుకొన్నాక వాటిని హెజ్బొల్లా టాప్ కమాండర్స్ తో పాటు ఫైటర్స్ కి, కొరియర్స్ కి ఇచ్చింది.

గోడౌన్స్ ని ఇజ్రాయేల్ పేల్చివేసిన తరువాత మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థని పేజర్లు, వాకీ టాకీలు, వైర్లేస్ రేడియోలకి పరిమితం చేసింది హెజ్బొల్లా! ఇక్కడే ఇజ్రాయేల్ ని తక్కువ అంచనా వేశాయి హెజ్బొల్లా, ఇరాన్ లు. 2G నెట్వర్క్ మీద పనిచేసే పేజర్స్ ని హ్యాక్ చేయలేదని అనుకున్నారు కానీ అందులో నిజం ఉంది!

కానీ ఎలా పేలిపోతున్నాయి? పేజర్స్ లో ఉండేది AAA బాటరీలు! అవి పేలితే తీవ్రంగా గాయపడడం లేదా చనిపోవడం జరగదు! అసలేం జరిగింది అంటే……

ఆర్డర్ తీసుకున్నది తైవాన్ కి చెందిన గోల్డ్ అపోలో అయినా ఈ రోజుల్లో వాటి కోసం సమయం వృధా చేసే స్థితిలో లేదు, విడి భాగాలు గోల్డ్ అపోలోకి చెందిన లైసెన్స్డ్ సంస్థ హంగరీ రాజధాని బుడాపెస్ట్ లో ఉంది. పేజర్స్ ని పంపించి అక్కడ వాటిని అసెంబుల్ చేసి ఇరాన్ కి డెలివరీ చేసింది!

సరిగ్గా బుడాపెస్ట్ లోనే అంతా జరిగింది!

పేజర్స్ ని అసెంబుల్ చేసే సమయంలో మోస్సాద్ వాటిలో 3 గ్రాముల నుండి 5 గ్రాముల మధ్య బరువు ఉండే ప్లాస్టిక్ explosive ని బ్యాటరీతో కలిపి ఒక చిన్న సైజులో ఉన్న సాఫ్ట్ వేర్ ని ఇంస్టాల్ చేసింది!  పేజర్స్ లో మోస్సాద్ ( may be in 5 kb ) ఇంస్టాల్ చేసిన సాఫ్ట్ వేర్ మోస్సాద్ నుండి వెళ్లే కమాండ్ తో మాత్రమే ఆ సాఫ్ట్ వేర్ పనిచేసి బాటరీ నుండి వచ్చే పవర్ ద్వారా పేలుతుంది అన్నమాట!

******
ఇప్పటి వరకూ 7,000 మంది హెజ్బొల్లా ఉగ్రవాదులు పేలుళ్ల బారిన పడ్డారు. రెండు రోజుల్లో లేబనాన్, సిరియాలలో వరుస పేలుళ్ళు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి! పేలుళ్ల వల్ల చనిపోయిన వారి సంఖ్య 47 కి చేరుకుంది!

దీనివల్ల ఎవెరెవరు హెజ్బొల్లాకి పనిచేస్తున్నారో బయటపడ్డది. తోపుడు బళ్ళ మీద పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునే వారు, మోటార్ గ్యారేజ్ లో పనిచేసేవాళ్ళు, హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వ వాహనాలు నడిపే డ్రైవర్లు, ఇలా అన్ని రంగాలలో పని చేసే వారు హెజ్బొల్లా నెట్వర్క్ లో ఉన్నారు. వీళ్ళకి పేజర్స్ ఇచ్చింది హెజ్బొల్లా!

హెజ్బొల్లాకి పనిచేసే వాళ్ళు మాత్రమే పేజర్స్ ని వాడుతున్నారు కాబట్టి బాధితులు కూడా వాళ్ళే! బాధితుల్లో గృహిణులు కూడా ఉన్నారు! మరి మొదటి సారిగా పేజర్స్ పేలినప్పుడు సమాచారం మిగతా వాళ్లకి ఇచ్చి పేజర్స్ ని దూరంగా పారేయండి అని హెజ్బొల్లా అగ్ర నాయకత్వం ఎందుకు హెచ్చరించలేక పోయింది అన్న ప్రశ్న రావొచ్చు.

హెజ్బొల్లా టాప్ లీడర్స్ కూడా వీటి బారిన పడి హాస్పిటల్ లో ఉన్నారు. మొబైల్ వాడకూడదు కాబట్టి వేరే వ్యవస్థ లేదు సమాచారం ఇవ్వడానికి. అందుకే సంఖ్య 7 వేలకి చేరుకుంది! బాధితుల్లో చొక్కా జేబులో పేజర్ పెట్టుకున్న వాళ్ళు మరణించారు, ఎందుకంటే జేబు గుండెకి దగ్గరగా ఉంటుంది కాబట్టి!

ఎక్కువ శాతం ప్యాంటు జేబులో పేజర్ ని పెట్టుకున్నారు కాబట్టి ప్రాణ హాని జరగలేదు. కానీ పేలుడుకి టెస్టికిల్స్ (వృషణాలు ) చితికి పోయినవారే ఎక్కువగా ఉన్నారు. నాకైతే పాత జేమ్స్ బాండ్ సినిమా లో Mr. Q గుర్తుకు వచ్చాడు! Mr. Q తన కొత్త ఆవిష్కరణలని బాండ్ కి చూపిస్తూ అవి ఎలా పని చేస్తాయో ట్రయల్ వేసి చూపించడం మీరూ చూసే ఉంటారు కదా! మరో అప్డేట్ తో మళ్ళీ వస్తా!….. (పొట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions