.
ముక్కుతూ మూలుగుతూ ఎక్కడో పాయింట్ల టేబుల్లో దిగువన ఉండే కోల్కతా టీమ్ హఠాత్తుగా విజృంభించి వరుస అయిదు విజయాలతో ఉన్న గుజరాత్ జట్టును ఓడించేస్తుంది… సేమ్, బాగా ఆడుతున్న బెంగుళూరు జట్టు మీద పరాజయాల లక్నో జట్టు అకస్మాత్తుగా ఓ అనూహ్య విజయం సాధిస్తుంది… సేమ్, పంజాబ్ జట్టు మీద ముంబై కూడా… ఈ హఠాత్ విజయాలతో ముంబైకి, లక్నోకు, కోల్కతాకు వచ్చిపడే ఫాయిదా ఏమీ ఉండదు…
ఈ అకస్మాత్తు విజృంభణతో అవేమీ ప్లే ఆఫ్ బరిలోకి పోయేది లేదు… కానీ ఎదుటి జట్ల ఈక్వేషన్లను మారిపోతాయి… టాప్ 4 జాబితాలోకి చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోతాయి… దీంతో ఇప్పుడు జరుగుతున్న చివరి లీగ్ మ్యాచులు ఆసక్తికరంగా మారుతాయి… ఐపీఎల్ ఆట రక్తికడుతుంది…
Ads
నిన్న జరిగిన మ్యాచ్ సంగతే తీసుకొండి… కోల్కెతా రెచ్చిపోయి 247 రన్స్ దంచి కొట్టింది… ఫిన్ అలెన్ 35 బాల్స్ లో 10 సిక్సులతో 93 రన్స్ చేశాడు… రఘువంశీ 82 రన్స్… ఇన్నాళ్లూ ఏమైంది మరి కోల్కతా ఆటతీరు..? 247 రన్స్ చేధించడం అంటే మామూలు విషయం కాదుగా… అందుకే గుజరాత్ చేతులెత్తేసింది…
సాయి సుదర్శన్, శుభమన్ గిల్, బట్లర్ కొంత పోరాడినా చివరకు 218 దాకా వచ్చి ఆగిపోయారు… గుజరాత్ ఈ మ్యాచులో బౌలింగ్, బ్యాటింగు, ఫీల్డింగు అన్నింట్లోనూ నాసిరకం ప్రదర్శనే… కీలకమైన మూడు మ్యాచులు వదిలేశారు… మూల్యం చెల్లించుకున్నారు…
ఈరోజు పంజాబ్, బెంగుళూరు మ్యాచ్ ప్లస్ రాజస్తాన్, ఢిల్లీ మ్యాచ్ ఉన్నయ్… పంజాబ్కు, రాజస్తాన్కు కీలక మ్యాచులే ఇవి… చావోరేవో… ఢిల్లీకి పెద్దగా ఆశల్లేవు, బెంగుళూరు కంఫర్ట్ జోన్లో ఉంది… ఒకవేళ ఢిల్లీ గనుక గెలిస్తే రాజస్తాన్ అవకాశాలు ప్రమాదంలో పడ్డట్టే…!!
Share this Article