.
అన్నా, నువ్వు పెద్దన్న, అంతే పెద్ద మనసుతో మా రాష్ట్ర అభివృద్ధికి సహకరించు అనగానే… సరే, తమ్ముడూ, అలాగే, నేనున్నా నీవెంట, గో ఎహెడ్ అనడానికి మోదీ రాజనీతిజ్ఙుడు ఏమీ కాదు… జస్ట్, ఏ పొలిటిషయన్… అని తనే నిరూపించుకుంటున్నాడు…
రేవంత్ రెడ్డి ఎంతసేపూ డెవలప్మెంట్ యాంగిల్లో… రాష్ట్ర- కేంద్ర సమన్వయం అంటాడు, సహకారం అంటాడు, రాజకీయాలు వేరు- అభివృద్ధి వేరు అంటాడు, ఫెడరల్ స్పిరిట్ అంటాడు… ఎన్ని అన్నా సరే, మోదీ తనను కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగానే చూస్తాడు… అది క్లియర్… ఎందుకంటే, మోదీ కేవలం ఓ రాజకీయ నాయకుడు మాత్రమే…
Ads
ఇదిలా కాదని రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకుల్ని, కేంద్రంలో చక్రాలు తిప్పుతామనే భ్రమల్లో ఉన్న కిషన్ రెడ్డి వంటి నాయకుల్ని గోకుతూ బజారుకు లాగడం మొదలుపెట్టాడు… జనంలో పలుచన చేస్తే తప్ప దిగిరారని అనుకున్నాడు…
కానీ కిషన్ రెడ్డి ఓ షో చేశాడు, మెట్రోపై కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్లు అన్నాడు, ఫోటోలు దిగారు… మెట్రో ఫస్ట్, సెకండ్ ఫేజులపై ముందుకెళ్లు, నీకెందుకు, మేమున్నాం కదా అనిపించాడు… అంతా పైపైనే, ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెన్సీ అన్నారు… తీరా ఏమైంది..?

ఏమీ కాలేదు, కాదు కూడా… పెద్ద దొర ప్రభావంలో ఉండే రాష్ట్ర బీజేపీ, రాబోెయే ఎన్నికల్లో చిన్న దొర జెండా మోయాలనుకునే రాష్ట్ర బీజేపీ పడనిస్తుందా..? నివ్వలేదు… అందుకే మెట్రో మొత్తం ఎక్కడికక్కడ స్టాప్… అడుగు కదలడం లేదు ఫైళ్లు…
మీ 13,600 కోట్లు మీరే సేకరించుకొండి అంటుంది కేంద్రం, రాష్ట్ర తన ప్రతినిధిగా జయేష్ రంజన్ను ప్రకటించినా కేంద్రం తన ప్రతినిధి ఎవరో చెప్పలేదు… మొత్తానికి ఓ శూన్య స్థితి… పోనీ, ఎన్వోసీ ఇవ్వరా బాబూ అనడిగితే అదీ పట్టించుకోదు కేంద్రం…
ఉద్దేశం చాలా క్లియర్… మెట్రో కదలకూడదు… బీఆర్ఎస్ చెప్పినట్టు నడవాలి… తెలంగాణకు సంబంధించిన ఏ అంశమైనా సరే కేవలం పార్టీ, రాజకీయాల కోణంలో మాత్రమే చూడాలి… ఇదీ ది గ్రేట్ రాజనీతిజ్ఞ మోదీ యవ్వారం..!!
Share this Article