.
రాష్ట్రపతి భవన్లో ఒక అరుదైన క్షణం: డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం విశిష్ట వ్యక్తిత్వం
ఒకసారి ప్రముఖ శంకరాచార్యులు మొదటిసారిగా రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఆ సన్యాసికి తగిన గౌరవం ఇవ్వాలని భావించారు. ఆ సమయంలో రాష్ట్రపతి భవన్ కంప్ట్రోలర్గా ఉన్న లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ ని తన కార్యాలయానికి పిలిచి సాంప్రదాయ ప్రోటోకాల్ గురించి అడిగారు…
Ads
ప్రోటోకాల్- కలాం ఆలోచన
మొదటి సంభాషణ..: “నేను స్వయంగా గేటు వద్దకు వెళ్లి స్వాగతిస్తే ఏమవుతుంది?” అని కలాం అడిగారు. “సార్, అలా చేస్తే మీరు రాష్ట్రపతి హోదా కంటే ఆ సన్యాసి గౌరవాన్ని ఉన్నతంగా ఉంచినట్లవుతుంది” అని కంప్ట్రోలర్ బదులిచ్చారు. కలాం చిరునవ్వు నవ్వి ఏమీ అనలేదు.
రెండవది…, సన్యాసి కూర్చునేందుకు విజిటర్స్ సోఫాపై పులిచర్మం ఆసనాన్ని ఏర్పాటు చేస్తానని, రాష్ట్రపతి తన సాధారణ సోఫా కుర్చీలోనే కూర్చుంటారని చెప్పగా… “నేను కూర్చునే నా సోఫా సీటుపై ఆయన్ను కూర్చోబెడితే ఏమవుతుంది?” అని కలాం మళ్లీ ప్రశ్నించారు. దానికి కూడా కంప్ట్రోలర్ అదే సమాధానం చెప్పారు. అప్పుడూ కలాం కేవలం చిరునవ్వు నవ్వి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు.
ఆశ్చర్యకరమైన ఘట్టం
ముప్పై నిమిషాల తరువాత ఆ సన్యాసి రానేవచ్చారు. కొద్ది క్షణాల ముందు కంప్ట్రోలర్ ఆశ్చర్యపోయేలా, డాక్టర్ కలాం స్వయంగా గేటు వద్ద ఆయన వెనుక నిలబడి ఉన్నారు. ఆయన చేతిలో పూలమాల, పుష్పగుచ్ఛం ఉన్నాయి.
అందరూ కలిసి కారిడార్ల గుండా నడుచుకుంటూ నేరుగా కార్యాలయంలోకి ప్రవేశించారు. కంప్ట్రోలర్ విజిటర్స్ సోఫాపై ఆసనం వేయడానికి సిద్ధమవుతుండగా, కలాం ఆ ఆసనాన్ని నేరుగా తన అధికారిక సోఫా కుర్చీపై వేయాల్సిందిగా ఆదేశించారు. ఆ సాధారణ, వినయపూర్వకమైన, గొప్ప చర్యను చూసి కంప్ట్రోలర్ నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత సన్యాసికి పండ్లు, పూల బుట్టను బహుకరించారు.
ఆ ఆశ్చర్యకరమైన నిర్ణయానికి అసలు కారణం
సమావేశం (ములాఖత్) ముగిసిన తర్వాత, కంప్ట్రోలర్ ఆ విధంగా చేయడానికి అసలు కారణం ఏంటని కలాంని అడిగారు. దానికి కలాం చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పారు…
“భారతదేశ రాష్ట్రపతి కూర్చునే సోఫా సీటు ఆ సన్యాసి ఆధ్యాత్మిక శక్తితో పవిత్రం, మరింత శక్తిమంతం కావాలని నేను కోరుకున్నాను. తద్వారా భవిష్యత్తులో ఈ స్థానంలో కూర్చునేవారందరికీ ఆ సన్యాసి ఆశీస్సులు లభిస్తాయి…”
ఆ మాటలు విన్న కంప్ట్రోలర్ కలాంని ప్రశంసిస్తూ— “సార్, మీరు కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, ముసుగులో ఉన్న ఒక మహోన్నత సన్యాసి” అన్నారు. ఎప్పట్లాగే ఆయన తనదైన అర్ధవంతమైన చిరునవ్వును నవ్వారు…

(ఈ ఫోటో ఆ సందర్భంలోనిది కాదనీ, ఆయన అసలు శంకరాచార్యులే కాదని కొందరంటారు… అసలు రాష్ట్రపతి కంప్ట్రోలర్గా కిని అశోక్ పనిచేయలేదని మరికొందరంటారు… సో వాట్..? కలాం విభిన్న వ్యక్తిత్వం మాత్రం అలాంటిదే… అందుకే ఈ కథనం చదవడానికి బాగుంది… ఉన్నత స్థానాల్లో కొలువైన వ్యక్తులు ఎంత హుందాగా, ఎంత సంస్కారయుతంగా ఉండొచ్చో చెప్పుకోవడానికీ బాగుంది…)
Share this Article