.
ఒక పోస్టు కనిపించింది… అమిత్ షా, మోడీ హోమం చేస్తున్నారు… ఇలా హవిస్సులు అర్పిస్తున్నారు… ఉద్ధవ్ థాకరే ……..స్వాహా
శరద్ పవార్ ………స్వాహా
అఖిలేష్ యాదవ్….స్వాహా
నవీన్ పట్నాయక్….స్వాహా
లాలూ- తేజస్వీ……..స్వాహా
కేజ్రీవాల్……………..స్వాహా
తరుణ్ గొగోయ్……..స్వాహా
స్టాలిన్………………..స్వాహా
మమతా బెనర్జీ………స్వాహా

Ads
బలమైనా యాంటీ బీజేపీ నేతలను ఒక్కొక్కరినీ… జనమేజయుడి సర్పయాగంలోకి తోసేస్తున్నట్టుగా… కాస్త అతి అనిపించినా సరే… నిజమే… మోడీకి ముందు బీజేపీ… తరువాత బీజేపీ… ఈ కోణంలో ఆలోచిస్తే అనేక అతిరథ మహారథులు కాడి కింద పడేశారు… బీజేపీ సాగిస్తున్న అశ్వమేధం రాజ్యాలను కబళిస్తూ పోతోంది…
బీజేపీయే ఓ రెండు చార్టులు విడుదల చేసింది…


బెంగాల్ గెలుపు తరువాత… బీజేపీ చీఫ్ మినిస్టర్లు 17 రాష్ట్రాల్లో… ఎన్డీయే ముఖ్యమంత్రులు 5 రాష్ట్రాల్లో… 2013లో 773 మంది ఎమ్మెల్యేలుండగా ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 1798 కు చేరింది… ఇది మామూలు సామ్రాజ్య విస్తరణ కాదు…
పేరుకు కాంగ్రెస్ ముక్త భారత్ అని పేరు పెట్టుకున్నా సరే… నిజానికి బీజేపీ టార్గెట్ చేస్తోంది ప్రాంతీయ పార్టీలను, కుటుంబ పార్టీలను, అవినీతి పార్టీలను… ఐతే విశేషం ఏమిటంటే… అవసరమున్నచోట ప్రాంతీయ పార్ఠీలతో సఖ్యతతో వ్యవహరిస్తూ, తరువాత తనే ఆక్రమించేసుకోవడం..!
తాజాగా మరో ప్రాంతీయ పార్టీ మట్టి కరిచింది… ఏకంగా నేనెందుకు ప్రధాని కాకూడదు అనుకున్న కేసీయార్లాగే మమతా బెనర్జీ కూడా అధికారం నుంచి నిష్క్రమించింది దారుణ పరాజయంతో… డీఎంకే, అన్నాడీఎంకే కూడా ఓడిపోయాయి, కానీ మరో ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చి విజయఢంకా మోగించింది…
ఇవే కాదు, జార్ఖండ్ ముక్తిమోర్చా అలాగే ఉంది బలంగా… పంజాబ్లో ఉన్న ఆప్ కూడా దాదాపు ప్రాంతీయ పార్టీయే… జమ్ముకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది… జాతీయ పార్టీలకు వస్తే లెఫ్ట్ పని ఒడిశినట్టే… కాంగ్రెస్ మాత్రం ఆల్రెడీ కర్నాటక, తెలంగాణ, హిమాచల్లలో అధికారంలో ఉండగా, ఇప్పుడు తాజాగా కేరళం వచ్చి చేరింది… బీజేపీ ప్రధానంగా టార్గెట్ చేస్తోంది వ్యక్తి కేంద్రిత ప్రాంతీయ పార్టీలను…
బీజేపీతో తలపడితే… ఖల్లాసే అని లేటుగా అర్థమైంది చంద్రబాబుకు… మోడీని పరుషంగా ఆడిపోసుకుని, ఏదో సాధిద్దామని అనుకుని, భంగపడి, చివరకు అదే మోడీ శరణుజొచ్చి, సర్దుబాటు చేసుకుని ఇప్పుడు పదిలంగా అధికారంలో కొనసాగుతున్నాడు…
కేసీయార్ కూడా అదే… మోడీని నానారకాలుగా బదనాం చేయబోయి, భంగపడి, ఓటమిపాలై… ఇప్పుడు తత్వం బోధపడి, అదే బీజేపీలో చివరకు విలీన ప్రయత్నాలు కూడా చేశాడు… ఇప్పుడూ పొత్తు, అవగాహన ప్రయత్నాల్లో ఉన్నాడు… మొత్తానికి దేశరాజకీయాలు ఏదో అనిర్వచనీయ సంధిదశలో ఉన్నాయి..!!
మరో అంశం… ఇండి కూటమిలో బలమైన నాయకులు ఇన్నాళ్లూ స్టాలిన్, మమత… ప్రస్తుతం దెబ్బతిన్నారు… లెఫ్ట్ తరఫున పినరై విజయన్, తనూ దెబ్బతిన్నాడు… కేజ్రీవాల్ ఆల్రెడీ దెబ్బతిన్నాడు… స్థూలంగా బీజేపీ ఇండికూటమిని క్రమంగా దెబ్బతీస్తూ పోతోంది…!!
అవునూ, ఒకే పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యం దేశానికి మంచిదేనా..? ఇది డిబేటబుల్..!!
Share this Article