Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పరుగు తీసే కాళ్లల్లో కట్టెపుల్లలు… కాంగ్రెస్‌లో ఈ ధోరణి పోదా..?!

November 11, 2024 by M S R

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా చాలా ఎక్కువ… కానీ గతంలోలాగా లేదు ఇప్పుడు పరిస్థితి… తెలంగాణ విషయానికే వస్తే… హైకమాండ్ మ్యాండేట్ ఇచ్చింది… సీఎం‌గా రేవంత్ రెడ్డికి చాన్స్ ఇచ్చింది…

దాన్ని అన్ని దశల్లోని నాయకులు, కేడర్ సపోర్ట్ చేయాలి… కానీ కొందరు నేతలు రేవంత్ నాయకత్వం మీద తెల్లార్లూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు… పార్టీ కిమ్మనదు… జనంలోకి నెగెటివ్ సంకేతాలు వెళ్తుంటాయి… మరి ప్రజెంట్ సక్సెస్‌ఫుల్ వ్యూహకర్తలుగా గొప్పలు ఆపాదించబడుతున్న సునీల్ కనుగోలు వంటి వ్యక్తులు వీటి మీద ఎందుకు దృష్టి సారించరు..?

తెలంగాణలో కాంగ్రెస్‌కు ఇరువైపులా ముప్పే… ఒకవైపు గత ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ క్రమేపీ బలం పుంజుకుంటోంది… కేటీయార్, హరీష్ ప్రతి ఇష్యూలో కాళ్లువేళ్లు పెట్టి రేవంత్ మీద ముప్పేటదాడి చేస్తున్నారు… గత ఎన్నికల నాటి ప్రజావ్యతిరేకత మొత్తం పోయిందని చెప్పలేం గానీ బీఆర్ఎస్ గతంతో పోలిస్తే మరీ అంత దయనీయంగా ఏమీ లేదు ఇప్పుడు…

Ads

మరోవైపు బీజేపీకి బాగా ఆశలున్నాయి… నాయకత్వ సమస్య, అంతర్గత కుమ్ములాటలతో అది మరో కాంగ్రెస్‌లా కనిపిస్తోంది గానీ… రాబోయే హైదరాబాద్ నగర ఎన్నికల మీద బాగా ఆశలున్నాయి దానికి… స్థానిక ఎన్నికల సంగతి చెప్పలేం… సో, ఈ స్థితిలో కాంగ్రెస్ జాగ్రత్తగా అడుగులు వేయాలి, అది చిన్న విషయమైనా సరే, లేదంటే బీఆర్ఎస్ లేదా బీజేపీకి చేజేతులా చాన్స్ ఇచ్చినట్టే అవుతుంది…

ఉదాహరణకు… హైదరాబాద్ వాటర్ బోర్డు కార్మిక సంఘం విషయం తీసుకుందాం… ఐఎన్‌టీయూసీకి అనుబంధంగా ఉన్న కామ్‌గార్ యూనియన్ ప్రస్తుత అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి… తను సీఎం రేవంత్‌రెడ్డికి కుటుంబసభ్యుడు… చాలా దగ్గరి బంధువు… కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి ఎన్నికకు తన సోదరుడు కొండల్ రెడ్డితోపాటు పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తించాడు…

తనకు ఏ నామినేటెడ్ పోస్టూ దక్కలేదు… సరే, ఆ వాటర్ బోర్డు కార్మిక సంఘం ఎన్నికల్లో నిలబడటానికి ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి మ్యాండేట్ ఇచ్చాడు… రాజిరెడ్డి ఐఎన్‌టీయూసీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా..! ఆరేడు వేల మంది సిబ్బందికి ప్రాతినిధ్యం కల్పించే ఎన్నిక అది…

ఇందులోనూ మళ్లీ కాంగ్రెస్ వైరుధ్యాలు… మధు యాష్కి ఇంకెవరినో పోటీగా తీసుకొచ్చి పాలిటిక్స్ మొదలు పెట్టాడు… దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఒకరకంగా చాన్స్ చేజేతులా ఇచ్చినట్టే అనే సోయి కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోయింది… బీజేపీకి ఆ బోర్డు స్టాఫులో పెద్ద బేస్ లేదు, కానీ బీఆర్ఎస్ కాస్త శ్రమపడితే అది కేటీయార్, హరీష్ ఖాతాలో పడే అవకాశం ఉంది…

ఇదుగో ఇలాంటి విషయాల్లోనే పీసీసీ యాక్టివ్ రోల్ ప్లే చేయాలి… పార్టీ కోసం పనిచేసే వాళ్ల కాళ్లల్లో కట్టెపుల్లలు పెట్టే ధోరణులకు అడ్డుకట్ట వేయగలిగితేనే… మళ్లీ బలం పుంజుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రమైనా చెక్ పెట్టగలదు… లేకపోతే..?!

…. అన్నట్టు… ఆ స్టాఫ్ కోరుకునే ప్రధాన అంశం… ప్రభుత్వ ఉద్యోగుల్లాగే వైద్యచికిత్స బీమా… వాటర్, సీవరేజీ పనులు చేసే ఆ స్టాఫ్ కోరిక న్యాయబద్ధం… ప్రభుత్వం దాని గురించి పాజిటివ్‌గా ఆలోచించాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions