.
జాగ్రత్తగా ఒకటికొకటి క్రోడీకరించి చదువుకొండి… ఇండియాలోనే ఉంటూ, యాంటీ ఇండియన్లుగా బతికే, కుట్రలు పన్నే చెత్తా వెధవ బతుకులు, రాతల ప్రకాష్ రాజ్ల గురించి కాసేపు మరిచిపొండి… తాజా వార్త ఏమిటి.? బెంగాల్, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో ఓ వెధవ పోలింగ్ ఆఫీసర్ కమలం గుర్తు మీద ఎవరూ ప్రెస్ చేయకుండా ఈవీఎం మీద టేప్ అతికించాడు… (బీజేపీ గెలిస్తే ప్రతి వెధవా మళ్లీ ఈవీఎం ట్యాంపరింగ్ అనే వెధవ కూతలు కూస్తాడు)…
- నిజానికి చాలా చిన్న విషయం… ఇన్నేళ్లుగా రౌడీ రాణి మమత బెనర్జీ చేస్తున్నది అదే… కాదంటే ఆ పోలింగ్ ఆఫీసర్ బతికి బట్టకట్టడు, వ్యతిరేకించినోడు కూడా… ఆ నియోజకవర్గం ది గ్రేట్ మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నియోజకవర్గమే… (తన ఎంపీ నియోజకవర్గం)… వాడెవడు..?
వాడు..? మమత బెనర్జీ రౌడీ రాజ్యానికి సైన్యాధికారి… ఎవరి మీద దాడులు చేయాలి..? ఎవడిని తొక్కాలి అనేది వాడే నిర్దేశిస్తుంటాడు… ఇక్కడ మరో విషయం… వాడి భార్య పేరు రుజిరా నరూలా… బెంగాలీ పేరులా లేదు అనుకుంటున్నారా..? అవును… ఆమె రూట్స్ థాయ్లాండ్… ఆ పాస్పోర్టు కూడా ఉందామెకు… (అందరూ అస్సోం గగోయ్ భార్య ఎలిజబెత్ పాస్పోర్టుల గురించి, రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వం గురించే రచ్చ చేస్తుంటారు.., కానీ మమత మేనల్లుడి, తన రాజకీయ వారసుడి, తన పార్టీ ఆర్గనైజర్ భార్య పౌరసత్వం గురించి మాత్రం మాట్లాడరు…)
Ads
- ఈ రుజిరా సోదరి పేరు మేనకా గంభీర్… ఈమె మరింత నొటోరియస్… కోల్ స్కామ్ దగ్గర నుంచి బెంగాల్ అక్రమాలన్నింటిలోనూ ఈ మరదలితో ప్రధాన పాత్ర… ఓసారి అక్కాచెల్లెళ్లు థాయ్లాండ్ నుంచి వస్తూ అర్ధరాత్రి 2 కిలోల బంగారంతో దిగారు, కలకత్తాలో కస్టమ్స్ వాళ్లు ఆపారు… దిగ్రేట్ అభిషేక్ ఆదేశించగానే వందల మంది పోలీసులు వెళ్లి, వాళ్లను అక్కడి నుంచి తప్పించారు, తరలించారు… అదీ బెంగాల్ పాలన…
అన్నట్టు ఈమె తల్లి పేరు గురుశరణ్ కౌర్… సిక్కు మూలాలు… కోల్ స్కాం తదితర వ్యవహారాల్లో సీబీఐ, ఈడీ కన్నుంది ఈ అక్కా చెల్లెళ్లపై..! అసలు నిందితురాలు మమతా బెనర్జీయే… పేరుకు నిరాడంబరం, ఆస్తుల్లేవు అనేది షో… అన్నీ బినామీ పేర్లపైనే ఉంటాయి… అంతెందుకు, ఆ వెధవ ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ కలకత్తా ఆఫీసే ఆమె అక్రమాలకు అడ్డా… అందుకే ఈడీ దాడులు చేస్తే, తనే డీజీపీ వెధవను వెంటేసుకుని, కీలకమైన డాక్యుమెంట్లను పట్టుకొచ్చేసింది మమత…
- ఆమెను కీర్తించే వెధవల కోసమే ఈ కథనం… ఎస్, ఆమె ఈ దేశానికే ద్రోహి… పాయింట్లవారీగా చెప్పుకుందాం… మోడీ, షా ఎన్ని విజయాలున్నా సరే, మమత కోణంలో అట్టర్ ఫ్లాప్ ఇన్నేళ్లూ… చేతకాలేదు… చేతులెత్తేశారు… ఆర్టికల్ 356 ప్రయోగించే అవకాశాలున్నా చేతకాలేదు… సుప్రీం ఏమంటుందో అనే భయం… ఇప్పుడు ఆ సుప్రీంకూ అర్థమైంది, బెంగాల్ రౌడీ రాజ్యం ఏమిటో…
సర్ ప్రక్రియ చేపడితే సోకాల్డ్ మమతకు వోటు బ్యాంకుగా మారిన బంగ్లా ముస్లిం అక్రమ వలసదారుల పేర్లు ఎగిరిపోతాయని మమత భయం… అడ్డుపడింది, న్యాయాధికారులను నిర్బంధించింది… చివరకు సీజేఐ ఇన్వాల్వయ్యేవరకూ మమత ప్రభుత్వం పట్టించుకోలేదు… అంత రౌడీ రాజ్యం… సుప్రీం కళ్లు తెరిచింది…
వేల కేంద్ర బలగాల మొహరింపు… అంతకుముందే గవర్నర్గా రవి నియామకం… తను డిప్యూటీ ఎన్ఎస్ఏ అంతకుముందు… మమత కథలన్నీ తెలుసు… దానికితోడు యూపీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మను దింపారు… జహంగీర్ ఖాన్, అభిషేక్ బెనర్జీ వంటి మమత మార్క్ ద్రోహులు ‘ఏం పీకుతావురా’ అని బహిరంగంగానే సవాల్ చేశారు… పక్కా వీథి రౌడీ మమతకు పర్ఫెక్ట్ అనుచరులు…
- సర్ ప్రక్రియను అడ్డుకోవాలనే కాదు, ఈ మెంటల్ శివగామి ఎన్ఆర్సీకి, సీఏఏకు వ్యతిరేకి… నా బొందిలో ప్రాణముండగా జరగనివ్వను అని సవాల్… సరిహద్దుల్లో కంచె వేయటానికి భూమి ఇవ్వదు… సీబీఐ, ఈడీలు వస్తే తన పోలీసులతో అరెస్టు చేయిస్తుంది… అంటే,, లక్షలాదిగా బంగ్లా అక్రమవలసదార్లు వచ్చినా పర్లేదు, ఒక్క హిందూ ఈ దేశంలోకి రావద్దు అట… (అర్థమైంది కదా, కొందరు యాంటీ నేషనల్స్ ఎందుకు ఆమెను ప్రేమిస్తారో)… (యాంటీ నేషనల్స్ వేరు- యాంటీ బీజేపీ వేరు… తేడా తెలియని వెధవల్ని కాసేపు వదిలేద్దాం)… (చివరకు తమను పాతాళంలోకి తొక్కిన సీపీఎంకు, కాంగ్రెస్కు కూడా తత్వం బోధపడలేదు… భయం, అజ్ఙానం)…
ఎందుకు ఈ ఎన్ఆర్సీ, సీఏఏ వ్యతిరేకత..? తను పోషిస్తున్న అక్రమ వలసదార్ల పౌరసత్వాలు ఎగిరిపోతాయని..? ఆమె కురచ మెదడు అంతకుమించి ఏమీ ఆలోచించదు కాబట్టి… అప్పటికే ‘చికెన్ నెక్’ ఏరియాలో బంగ్లా వలసదారులు పెరిగిపోయి… బంగ్లా కాలనీలుగా అవతరించాయి కాబట్టి… అది సిలిగురి కారిడార్ అనే ప్రమాదాన్ని పెంచుతోంది కాబట్టి…
- బంగ్లాదేశీయులు అనబడే ధూర్తులు భస్మాసురులు… మన వేల సైనికుల్ని బలిపెట్టి, వాళ్లకు విముక్తి కల్పిస్తే, ఇప్పుడు అదే పాత పెత్తందార్ల చంకలో చేరి, అదే ఐఎస్ఐ ప్రభావంతో ఇండియా మీద ద్వేషాన్ని గక్కుతున్నారు… వాళ్లే ఇప్పుడు ఇదే దేశద్రోహి మమత ప్రాపకంతో ఇండియాలోని బంగ్లా సరిహద్దుల్లో పెరిగీ పెరిగీ… దేశభద్రతకు అత్యంత కీలకమైన చికెన్ నెక్కు ప్రమాదకరంగా మారారు కాబట్టి…
ఇన్నేళ్లూ మన సుప్రీం, మన సీఈసీ, మన కేంద్రం… చేతకాలేదు… ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి… ఎస్, డైమండ్ హార్బర్లో ఒక ఈవీఎం దగ్గర నుంచి మొదలుపెడితే… ఈ మమతా బెనర్జీ అనబడే అత్యంత ప్రమాదకరమైన, టెర్రరిస్టులకన్నా ప్రమాదకరమైన ఓ కేరక్టర్ తీవ్రత ఏమిటో అందరికీ అర్థమవుతోంది… ఆమె గెలుస్తుందా, ఓడిపోతుందా…. మోదీ అనేవాడికి ఓ పక్కా దేశద్రోహిని ఏరేయడం చేతనవుతుందా లేదానేది వేరే విషయం… కానీ దేశానికి … ఆమెను కీర్తించే వెధవలకు ఆమె ఎవరో అర్థం కావాలి… కావాలి…
ఈ దేశానికి గల్లీ రౌడీలు తేజస్వి, అఖిలేష్ ప్రమాదం కాదు… ఒక పినరై విజయన్ కాదు, ఒక స్టాలిన్ కాదు… నిఖార్సుగా చెప్పాలంటే కేసీయార్, జగన్, ఉద్దవ్ ఠాక్రే అసలే కాదు… అసలు సిసలు ప్రమాదకారి మమత మాత్రమే…
కొసమెరుపు… రిగ్గింగ్ జరుగుతోందని ఉల్టా ఆరోపిస్తోంది మమత…
Share this Article