.
శతాబ్దాల నమ్మకంపై శవ రాజకీయం… ధర్మస్థల కుట్ర – సొసైటీ ఏం శిక్షించగలిగింది…? ఎవడి పాపాన వాడే పోతాడు అని వదిలేసిందా…?
దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన, న్యాయానికి మారుపేరైన క్షేత్రం కుదూర- ధర్మస్థల. మంజునాథ స్వామి కొలువై ఉన్న ఈ పుణ్యనేలపై రోజుకు వేలాది మంది భక్తులు ‘అన్నదానం’, ‘అభయదానం’ పొందుతుంటారు. అలాంటి తపోభూమిపై 2025లో ఒకే ఒక్క రాత్రిలో దేశం మొత్తం ఉలిక్కిపడేలా ఒక అపవాదు మోపబడింది.
Ads
“వందలాది మృతదేహాలను సామూహికంగా పూడ్చిపెట్టారు” అంటూ ఒక పథకం ప్రకారం చేసిన ఆరోపణ, ఆ తర్వాత జరిగిన హైడ్రామా… హిందూ సమాజం, ప్రభుత్వం, న్యాయవ్యవస్థల ముందు కొన్ని కీలకమైన ప్రశ్నలను ఉంచింది.
1. హిందూ సమాజం ఏం చేయగలిగింది? (ఆవేశం నుండి ఆలోచన వైపు) … ఈ కుట్ర బయటపడినప్పుడు హిందూ సమాజం స్పందించిన తీరులో రెండు భిన్నమైన కోణాలు కనిపిస్తాయి…
ప్రాథమిక ఆవేదన – గందరగోళం…: ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. సోషల్ మీడియాలో కొందరు ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు వ్యూస్ కోసం, డబ్బు కోసం ఈ అబద్ధాన్ని దావానలంలా ప్రచారం చేయడంతో సామాన్య భక్తులు కొంతకాలం అయోమయానికి గురయ్యారు.
ఐక్యత – క్షేత్రస్థాయి మద్దతు…: కానీ, ఎప్పుడైతే ఇదంతా ఒక ‘పెయిడ్ క్యాంపెయిన్’ అని, గుడి ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా సాగుతున్న కుట్ర అని అర్థమైందో… హిందూ సమాజం ఒక్కతాటిపైకి వచ్చింది. స్థానిక భక్తులు, వివిధ హిందూ సంఘాలు ఆలయ ధర్మకర్త వీరేంద్ర హెగ్గడే కుటుంబానికి, క్షేత్రానికి అండగా నిలిచారు…
డిజిటల్ ప్రతిఘటన…: అబద్ధపు వీడియోలను తిప్పికొడుతూ నిజాలను ప్రచారం చేయడం ప్రారంభించారు. ఫేక్ ప్రచారం చేసిన యూట్యూబర్లపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే, సమాజం పరంగా ఇంకా జరగాల్సింది ఏంటంటే… భవిష్యత్తులో ఇలాంటి సంచలన వార్తలు రాగానే గుడ్డిగా నమ్మకుండా, షేర్ చేయకుండా ఉండేంతటి ‘డిజిటల్ అవగాహన’ పెంచుకోవాల్సి ఉంది…
2. ప్రభుత్వం ఏం చేయగలిగింది? (రాజకీయ ఒత్తిడి వర్సెస్ నిష్పక్షపాత విచారణ) … ప్రభుత్వాల ముందు ఇలాంటి సున్నితమైన కేసులు వచ్చినప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ అతిపెద్ద సవాలుగా మారుతుంది.
SIT ఏర్పాటుతో వేగం…: ఆలయంపై ఆరోపణలు రాగానే కర్ణాటక ప్రభుత్వం ‘ప్రత్యేక విచారణ బృందాన్ని’ (SIT) ఏర్పాటు చేసింది. దీనివల్ల పుకార్లకు కొంత బ్రేక్ పడింది.
శాస్త్రీయ ఆధారాల సేకరణ…: ఫోరెన్సిక్ (FSL) ల్యాబ్ నివేదికల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు… కోర్టుకు సమర్పించిన ఎముకలు స్త్రీవి కావు, పురుషుడివి అని తేల్చడం ద్వారా కుట్రదారుల అసలు రంగును ప్రభుత్వం (పోలీస్ యంత్రాంగం) బయటపెట్టగలిగింది…
కుట్ర కోణంపై విచారణ…: కేవలం ఫిర్యాదుదారుడిని అరెస్ట్ చేయడమే కాకుండా, అతని వెనుక ఉండి నడిపించిన శక్తులు ఎవరు? విదేశీ ఫండింగ్ ఏమైనా ఉందా? ఆలయాన్ని టార్గెట్ చేయడం వెనుక ఉన్న మతపరమైన లేదా ఆర్థికపరమైన కుట్రలేంటి? అనే కోణంలో ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది… కానీ ఇప్పటివరకూ ఏమీ తేల్చలేదు, సమాజానికి ఏమీ వెల్లడించలేదు… ధర్మస్థల భక్తుల కళ్లకు గంతలు కట్టేసింది…
3. మన న్యాయవ్యవస్థ ఏం శిక్షించగలదు? (చట్టం ముందు నిలబడే నేరాలు) … ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, కుట్రలో ప్రధాన సూత్రధారిగా ఉన్నందుకు, కోట్ల మంది విశ్వాసాాలను దెబ్బతీసినందుకు (చిన్నయ్య), అలాగే తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై మన న్యాయవ్యవస్థ (Judiciary) ఎలాంటి శిక్షలు వేసే అవకాశం ఉందంటే…
కల్పిత ఆధారాలు సృష్టించినందుకు (Fabricating False Evidence)…: కోర్టును పక్కదారి పట్టించడానికి శ్మశానం నుండి ఎముకలు తెచ్చి, ఇవి హత్యకు గురైన మహిళలవని అబద్ధం చెప్పినందుకు (భారతీయ న్యాయ సంహిత – BNS ప్రకారం) కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, అదీ ప్రాసిక్యూషన్ రుజువు చేయగలిగితే…
కోర్టు ధిక్కరణ & పరువు నష్టం (Perjury & Defamation)…: ఒక పవిత్ర- ఆధ్యాత్మిక సంస్థ పరువు తీసినందుకు, కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు భారీ జరిమానాలతో కూడిన శిక్షలు పడాలి, కానీ కేసు అసలు కదిలితే కదా… పోలీసులు తరువాత పట్టించుకోవడమే మానేశారు… అదసలే మొన్నటిదాకా సిద్ధరామయ్య సర్కారు కదా…
యూట్యూబర్లపై సైబర్ చట్టాలు…: సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నించిన యూట్యూబర్ల ఛానళ్లను బ్లాక్ చేయడం, ఐటీ చట్టం (IT Act) కింద వారికి బెయిల్ దొరకకుండా జైలుకు పంపే అధికారం న్యాయవ్యవస్థకు ఉంది…. ప్రభుత్వం నుంచి ఏ స్పందనా లేదు…
కోట్ల మంది పూజించే గుడిపై కుట్రలు జరగడం ఇదే మొదటిసారి కాదు, చివరిసారీ కాకపోవచ్చు. శతాబ్దాల చరిత్ర గల ధర్మస్థలాన్ని ఒక అబద్ధం ఏమీ చేయలేకపోయింది. చివరకు సత్యమే గెలిచింది (సత్యమేవ జయతే)…. కానీ, ఈ ఉదంతం హిందూ సమాజానికి ఒక హెచ్చరిక. శత్రువు కేవలం కంటికి కనిపించేవాడే కాదు… సోషల్ మీడియాలో కూర్చుని అబద్ధాలను అమ్మేవాడు కూడా సమాజానికి శత్రువే అని ఈ కేసు నిరూపించింది… ఎక్కడో తమిళనాడులో ఉండే ఎవడో కుట్రదారుడిని కర్నాటక ప్రభుత్వం ఈరోజుకూ బయటపెట్టలేకపోయింది… వాడెవడో హాయిగా ఇంకేదో ప్లానింగులో ఉన్నాడేమో…
ఈ కేసులో చిన్నయ్య ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, వాడి మదిలో మరో కుట్ర, దానికి ఇంకెవడో ఫైనాన్షియర్ సాయం ప్లాన్లో ఉన్నాయేమో… తన ‘ధూత’ (Dhoota) యూట్యూబ్ ఛానల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ఉపయోగించి, ఎలాంటి ఆధారాలు లేని 23 నిమిషాల కల్పిత వీడియోను సృష్టించి ప్రచారం చేసినందుకు యూట్యూబర్ ఎమ్.డి. సమీర్ (వీడు కూడా అసలైన పాత్రధారి) కూడా బెయిల్ తెచ్చుకున్నాడు…!!
Share this Article