.
Pardha Saradhi Upadrasta …. సింధు నది ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసే దిశగా భారత్ చారిత్రాత్మక అడుగు
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు 75 ఏళ్ల పాటు భారత్కు చట్టబద్ధంగా కేటాయించిన రవి, బియాస్, సట్లేజ్ నదుల నీటిలో ఒక భాగం సరైన మౌలిక వసతులు లేక పాకిస్తాన్లోకి వెళ్లిపోతూనే ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది.
కొత్తగా పూర్తి స్థాయిలో ఆపరేషనల్ అయిన షాహ్పూర్ కండి డ్యామ్ ద్వారా భారత్ రవి నది జలాలను భారీ స్థాయిలో నిల్వ చేసి ఉజ్ బ్యారేజ్ వైపు మళ్లించడం ప్రారంభించింది.
దీని వల్ల పంజాబ్ , జమ్మూ & కాశ్మీర్లో వేలాది హెక్టార్ల భూమికి సాగునీరు అందనుంది. రైతులకు స్థిరమైన నీటి సరఫరా, జలవిద్యుత్ ఉత్పత్తి, నీటి భద్రత, ఈ మూడు రంగాల్లో కూడా ఇది పెద్ద మార్పుగా భావిస్తున్నారు.
Ads
1960 – సింధు నది ఒప్పందం అసలు ఏమిటి?
1960లో భారత్–పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో సింధు నది ఒప్పందం జరిగింది. ఇది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన జల ఒప్పందాల్లో ఒకటిగా భావిస్తారు.
ఈ ఒప్పందం ప్రకారం: పాకిస్తాన్కు ఇండస, జీలం , చెనాబ్ నదుల మీద ప్రధాన హక్కులు.
రవి, బియాస్, సట్లేజ్, అంటే తూర్పు నదులపై పూర్తి హక్కులు భారత్కు వచ్చాయి.
కానీ ఒక పెద్ద సమస్య ఉంది.
భారత్కు నీటి హక్కులు ఉన్నా వాటిని నిల్వ చేసి పూర్తిగా వినియోగించే సరిపడా డ్యామ్లు, బ్యారేజ్లు, కాలువలు దశాబ్దాల పాటు నిర్మించలేదు. దాంతో ప్రతి సంవత్సరం భారీ పరిమాణంలో అదనపు నీరు నేరుగా పాకిస్తాన్లోకి వెళ్లిపోయేది.
భారత్ ఎందుకు ఆలస్యమైంది?
1960 తర్వాత చాలా కాలం పాటు రాజకీయ ఆలస్యం, రాష్ట్రాల మధ్య వివాదాలు, భూసేకరణ సమస్యలు, ఫండింగ్ లోపాలు, పర్యావరణ అనుమతులు, పరిపాలనా ఆటంకాలు వంటి కారణాల వల్ల భారత్ తన వాటా నీటిని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. పచ్చిగా చెప్పాలి అంటే అప్పటి కేంద్ర, రాష్ట్ర పాలకులు ఈ డ్యామ్లు, బ్యారేజ్లు, కాలువల నిర్మాణములో పూర్తి అలసత్వం చూపారు. నదులు వుండగానే సరిపోదు, వాటిని సరిగా వినియోగించుకోవడానికి పథకాలు ఉండాలి.
భారత్ ఇప్పుడు తీసుకుంటున్న కీలక అడుగులు
గత దశాబ్దముగా భారత్ “తన వాటా నీటిలో ఒక్క చుక్క కూడా వృథా కాకూడదు” అనే దిశగా వేగంగా ముందుకు వెళ్తోంది.
ఈ వ్యూహంలో భాగంగా పలు ప్రాజెక్టులు కీలకంగా మారాయి.
కీలక ప్రాజెక్టుల టైమ్లైన్
1. రంజిత్ సాగర్ డ్యామ్
1980లలో ప్రాజెక్ట్ ప్రణాళికలు ప్రారంభమయ్యాయి.
1990లలో నిర్మాణం పూర్తయింది.
రవి జలాలను నిల్వ చేయడంలో ఇది తొలి ప్రధాన అడుగు. ఇది ఒక్కటే పూర్తిగా పనిచేసే ప్రాజెక్ట్.
2. షాహ్పూర్ కండి డ్యామ్ — కీలక మలుపు
షాహ్పూర్ కండి డ్యామ్ ఇప్పుడు భారత్ జల వ్యూహంలో అత్యంత కీలక ప్రాజెక్ట్గా మారింది.
1990లలో: ఈ ప్రాజెక్ట్ ఆలోచన మొదలైంది.
2013 వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
2013: అధికారిక నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి కానీ బోలెడంత ఆలస్యాలు.
2014–2018: పంజాబ్ , జమ్మూ & కాశ్మీర్ మధ్య ఖర్చుల భాగస్వామ్యం, భూసేకరణ, పరిపాలనా వివాదాల వల్ల పనులు నెమ్మదించాయి. కొన్ని దశల్లో పూర్తిగా ఆగిపోయాయి కూడా.
2018 తర్వాత: కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను జాతీయ ప్రాధాన్యత ప్రాజెక్ట్గా తీసుకుని వేగవంతం చేసింది. కేంద్ర నిధులు, క్లియరెన్స్లు, రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారంలు, నిర్మాణ పునఃప్రారంభం అన్నీ వేగంగా జరిగాయి.
2024: డ్యామ్ ప్రధాన నిర్మాణం పూర్తై పూర్తిస్థాయిలో ఆపరేషనల్ అయింది. ఇప్పుడు రవి జలాలను భారత్లోనే నిల్వ చేసి సాగుకు మళ్లిస్తున్నారు.
3. ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్
పాత ప్రతిపాదన: చాలా ఏళ్ల కిందటే వచ్చింది. కానీ మద్యలో ఎవరూ పట్టించుకోలేదు.
2020 తర్వాత: కేంద్రం దీన్ని వేగవంతం చేసింది.
ప్రస్తుతం: నిర్మాణం , అనుబంధ కాలువల పనులు కొనసాగుతున్నాయి. లక్ష్యం: జమ్మూ ప్రాంతానికి సాగునీరు, అదనపు జల నిల్వలు. ముఖ్యముగా ఆర్టికల్ 370 రద్దు తరువాత కొన్ని ఏళ్ళు జమ్మూ కాశ్మీర్ నేరుగా కేంద్రం అధీనంలోకి రావటం మూలానా ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం అయ్యింది. దాదాపు చివరి దశలో వుంది.
భారత్ అసలు వ్యూహం ఏమిటి?
భారత్ ఇప్పుడు మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు వెళ్తోంది.
1. వ్యవసాయ విస్తరణ ; పంజాబ్ , జమ్మూ & కాశ్మీర్లో వేలాది హెక్టార్ల భూమికి సాగునీరు.
2. నీటి భద్రత : భారత్కు కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం. మనం ఎవరి నోటి దగ్గర నీటికి లాక్కోవటం లేదు, మనకు అధికారికంగా వున్నజ్ హక్కులను వాడుకోవడానికి కావలసిన పదకాలు రచిస్తున్నాం, దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నాము.
3. జలవిద్యుత్ ఉత్పత్తి : హైడ్రో పవర్ సామర్థ్యాన్ని పెంచడం.
4. వ్యూహాత్మక ఒత్తిడి ; పాకిస్తాన్కు అదనపు నీటి ప్రవాహాన్ని గణనీయంగా తగ్గించడం.
ఇది సింధు నది ఒప్పంద ఉల్లంఘనా?
లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. భారత్ ఇప్పటికీ సింధు నది ఒప్పందమును అధికారికంగా రద్దు చేయలేదు, కేవలం భారత్కు చట్టబద్ధంగా ఉన్న వాటాను పూర్తిస్థాయిలో వినియోగించడం ప్రారంభిస్తోంది అంతే.
అంటే ఒప్పంద ఉల్లంఘన కాదు, చట్టబద్ధ హక్కుల పూర్తి వినియోగం
ఎందుకు ఇది చారిత్రాత్మక మలుపు?
దశాబ్దాల పాటు భారత్కు చెందిన నీరు సరైన మౌలిక వసతులు లేక వృథాగా వెళ్లిపోయేది. ఇప్పుడు మొదటిసారి భారత్ ఆ నీటిని నిల్వ చేసి వ్యవసాయం, విద్యుత్, నీటి భద్రత కోసం వినియోగించడం ప్రారంభిస్తోంది.
ఇది కేవలం కొన్ని డ్యామ్ ప్రాజెక్ట్ లు కాదు.
ఇది జల భద్రత, వ్యూహాత్మక ప్రణాళిక, వ్యవసాయ విస్తరణ, జాతీయ ప్రయోజనం
ఈ నాలుగు రంగాల్లో కూడా భారత్ దృక్పథం మారుతోందని చూపిస్తున్న చారిత్రాత్మక మార్పు. — ఉపద్రష్ట పార్ధసారధి
#India #Pakistan #IndusWatersTreaty #SindhuNadi #RaviRiver #ShahpurKandiDam #UjhProject #WaterSecurity #Geopolitics #Punjab #JammuAndKashmir #HydroPower #PardhaTalks
Share this Article