.
సరిహద్దు సెగ…: బెంగాల్ రాజకీయ మార్పులతో బంగ్లాదేశ్లో కలకలం, కలవరం.. దౌత్యపరమైన సవాళ్లు! అవును, బెంగాల్లో తాటకి కుర్చీ దిగిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం సరిహద్దు ఫెన్సింగ్ కోసం 600 ఎకరాల భూమిని BSFకు అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడం, అక్రమ వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించడం పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది…
1. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు… భారత్ తన సరిహద్దులను కట్టుదిట్టం చేసుకోవడాన్ని స్వాగతించాల్సింది పోయి, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ నుంచి వస్తున్న ప్రతిస్పందనలు విస్మయానికి గురిచేస్తున్నాయి… “ముళ్ల తీగలు మమ్మల్ని ఆపలేవు” అంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి…
Ads
ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం ఏమిటి? అంటే, అధికారికంగానే బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి… ఒక దేశం తన భద్రత కోసం కంచె వేసుకుంటే, అది తమను ఆపలేదు అని అనడం అంతర్జాతీయ నిబంధనలను ధిక్కరించడమే అవుతుంది… దరిద్రమైన స్పందన…
2. మమతా బెనర్జీ ఓటమిపై బంగ్లాదేశ్లో నిరసనలు? … మరో విచిత్రమైన అంశం ఏమిటంటే, పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిణామాలపై బంగ్లాదేశ్లోని కొన్ని వర్గాలు నిరసనలు తెలపడం.
ఎందుకు ఈ ఆందోళన? గత పదేళ్లుగా సరిహద్దులు దాటి బెంగాల్లోకి రావడం, అక్కడ స్థిరపడటం ఒక నిరంతర ప్రక్రియగా సాగింది. మమతా బెనర్జీ ప్రభుత్వం సరిహద్దు కంచెపై కేంద్రానికి ఏమాత్రం సహాయపడకపోవడం ఓరకంగా దేశద్రోహం… దేశభద్రతకు ప్రమాదకారి ఆమె…
ఇప్పుడు ప్రభుత్వం మారితే, చొరబాట్లు పూర్తిగా ఆగిపోతాయని, ఇప్పటికే ఉన్న వలసదారులను గుర్తించి వెనక్కి పంపుతారనే భయం బంగ్లాదేశ్లోని కొన్ని గ్రూపుల్లో స్పష్టంగా కనిపిస్తోంది… ఒక భారతీయ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై పొరుగు దేశంలో నిరసనలు జరగడం “ఓటు బ్యాంకు రాజకీయాల” మూలాలు ఎక్కడ ఉన్నాయో స్పష్టం చేస్తోంది…
3. జాతీయ భద్రత vs ఓటు బ్యాంకు … కోల్కతా హైకోర్టు వ్యాఖ్యానించినట్లుగా, “జాతీయ భద్రత కంటే ఏదీ ముఖ్యం కాదు…”
600 ఎకరాల భూమి ప్రాధాన్యత…: 2200 కిలోమీటర్ల సరిహద్దులో చాలా ప్రాంతం నదులు, అడవులు, జనసంచారం ఉన్న గ్రామాల గుండా వెళ్తుంది. ఇక్కడ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో భూసేకరణ పూర్తయింది, కానీ కేవలం బెంగాల్లో మాత్రమే జరగలేదు… కారణం, మమత పిచ్చి సాకులు…
బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ భూమిని అప్పగించడం ద్వారా పదేళ్లుగా పెండింగ్లో ఉన్న భద్రతా వలయాన్ని పూర్తి చేయాలని చూస్తోంది.
4. విశ్లేషణ: ఇది కొత్త రాజకీయ యుగానికి నాంది?… బంగ్లాదేశ్ మంత్రుల వ్యాఖ్యలు, అక్కడి నిరసనలు చూస్తుంటే, పశ్చిమ బెంగాల్లో అధికార మార్పు కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు, అది దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే చర్యగా కనిపిస్తోంది…
అమిత్ షా హామీ…: “బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఫెన్సింగ్ మొదలవుతుంది” అన్న మాటను ఆచరణలో పెట్టడం ద్వారా కేంద్రం ‘నేషన్ ఫస్ట్’ అనే సందేశాన్ని బలంగా పంపుతోంది… బంగ్లాదేశ్ నుంచి వస్తున్న “దరిద్రపు స్పందన” భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది…
సరిహద్దు భద్రత అనేది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు, ఇది దేశ మనుగడకు సంబంధించిన అంశం… బంగ్లాదేశ్ మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మమత ఓటమిపై అక్కడి ఆందోళనలు చూస్తుంటే, ఇప్పటివరకు సరిహద్దుల ద్వారా ఏ స్థాయిలో అక్రమ ప్రయోజనాలు పొందారో, మమత ఎలా సహకరించిందో అర్థమవుతోంది. ఇకపై ఆ ఆటలు సాగవనే సంకేతం భారత్ నుంచి బలంగా వెళ్తోంది…. మమత మళ్లీ లేవకుండా ఉండేలా కేంద్రం ఓ రాజకీయ కార్యాచరణ రూపొందించాలి… లేకపోతే దేశానికే ప్రమాదం..!!
Share this Article