.
పార్థసారథి పొట్లూరి… (తరువాయి భాగం)…. నిజానికి కిరానా హిల్స్ మీద భారత్ దాడి చేయలేదు. ఒకవేళ 1965 లోలాగా కిరాన హిల్స్ తో అనుసంధానం అయి ఉన్న ముషాఫ్ Air Complex మీద దాడి చేసి ఉండి ఉంటే విషయం ఇంకోలా ఉండేది!
అసలు కిరానా హిల్స్ కానీ ముషాఫ్ ఎయిర్ కాంప్లెక్స్ కానీ మా హిట్ లిస్టులో లేవు కాబట్టే మేము దాడి చేయలేదు అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏకే భర్తీ ప్రెస్ మీట్ లో చెప్పారు.
Ads
AK భర్తీ మరో మాట కూడా అన్నారు… అసలు కిరానా హిల్స్ లో భూగర్భ సొరంగాలు ఉన్న విషయం కానీ, అందులో అణు వార్ హెడ్స్ ని భద్రపరిచారు అన్న సంగతి కానీ మాకు ఇంతవరకూ తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది అందుకు ధన్యవాదములు అని అన్నారు ఓ విలేఖరితో!
మరి అమెరికా విమానం మాటేమిటి?
విమాన రాకపోకలని రికార్డ్ చేసే Flightradar24 అనే సంస్థ అమెరికన్ బీచ్ క్రాఫ్ట్ B350 ( Beechcraft B350) అనే విమానం పాకిస్తాన్ గగన తలంలో ఎగరడాన్ని గుర్తించింది! B350 విమానం అమెరికా డిపార్ట్మెంట్ అఫ్ ఎనర్జీ సంస్థదే!
Beechcraft B350 విమానంలో ఏరియల్ మేజరింగ్ సిస్టమ్ ( Aerial Measuring System – AMS ) ఉంటుంది. ఈ విమానంలో ఉండే AMS లో గామా కిరణాల సెన్సార్స్ తో మ్యాపింగ్ టూల్స్ ( GAMMA -RAY SENSORS AND MAPPING TOOLS) ఉంటాయి.
ఈ విమానాన్ని గాలిలో ఎగురుతూనే కింద భూమి మీద ఉండే రేడియేషన్, దాని తీవ్రత, ఎంతవరకూ రేడియేషన్ వ్యాపించి ఉందో తెలుసుకోవడానికి మాపింగ్ టూల్స్ తో కొలవడానికి వాడతారు. జపాన్ లో సునామి వచ్చినపుడు ఫుకుషిమ అణు రియాక్టర్ నుండి వెలువడే రేడియేషన్ ని కొలవడానికి ఇదే వాడారు!
ఈ విమానాన్ని 2010 లో పాకిస్థాన్ కి ఇచ్చింది అమెరికా. So! విమానం అమెరికాదే! అదే సమయంలో ఈజీప్ట్ నుండి మరో విమానం పాకిస్థాన్ లో లాండ్ అయ్యి కొద్దిసేపటి తరువాత తిరిగి వెళ్ళిపోయింది
ఈజిప్ట్ నుండి వచ్చిన విమానంలో బోరాన్ ( BORON) అనే కెమికల్ ఉంది. దానిని పాకిస్థాన్ లో అన్ లోడ్ చేసి వెళ్ళిపోయింది!
BORON కెమికల్ ని చాలా వాటిలో ఉపయోగిస్తారు కానీ అణు వ్యర్ధాలని సురక్షితంగా ఉంచడానికి కూడా ఉపయోగిస్తారు! So! రేడియేషన్ లీక్ అయిన మాట నిజమే! ముందు విమానంతో రేడియేషన్ తీవ్రతని కొలిచి అది లీక్ అవుతున్నదని తెలుసుకొని తరువాత BORON తో లీకేజిని ఆపారు!
ఇదంతా జరగాలి అంటే భారత్ దాడులు చేయడం ఆపాలి కాబట్టి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ తో మాట్లాడి, JD వాన్స్ మోడీతో ఫోన్ ద్వారా అభ్యర్థించిన తరువాతే మానవతా దృక్పధంతో మోడీ కాల్పుల విరమణకి ఒప్పుకున్నారు!
ఇక్కడ ఎవరి మధ్యవర్తిత్వం లేదు, కేవలం మోడీ దయచూపాడు, అంతే!
అయినా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది అని మోడీ ప్రకటించారు కదా?
కాబట్టి సినిమాకి ఇంటర్వెల్ ఇచ్చారు! క్లయిమాక్స్ ఇంకా మిగిలే ఉంది!
*******************
కాంగ్రెస్ బుర్ర తక్కువ వ్యాఖ్యలకి సమాధానం!
అమెరికా ఒత్తిడి చేస్తే మోడీ కాల్పుల విరమణకి అంగీకరించారా?
అదే ఇందిర అయితే అమెరికాని లెక్క చేయకుండా యుద్ధం కొనసాగించేదా?
1971 బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో అరేబియా సముద్రంలోకి బ్రిటన్ యుద్ధ నౌకలు, అమెరికన్ 7th fleet నావీ యుద్ధ నౌకలు ప్రవేశించి, మనపై దాడికి సిద్ధం అవుతున్నప్పుడు… సోవియట్ యూనియన్ తన అణు జలాంతర్గామిని పంపించడం వలన ఇందిర విజయం సాధించింది!
1971 లో మన దగ్గర, పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు.
1971 లో సర్ఫెస్ to సర్ఫెస్ మిసైల్స్ లేవు.
1971 లో యుద్ధ విమానాలకి ఎయిర్ to ఎయిర్ మిసైల్స్ లేవు, కేవలం అన్ గైడెడ్ బాంబులని జారివిడిచేవారు!
సాటిలైట్ సహాయం లేదు!
అమెరికా, బ్రిటన్ మనకి వ్యతిరేకంగా ఉండేవారు!
ఇప్పుడు ఏ దేశమూ మనకి వ్యతిరేకంగా ఎదురు చెప్పే స్థితిలో లేవు.
మన సైన్యానికి యుద్ధ ఖైదీలుగా చిక్కిన 93,000 మంది పాకిస్తాన్ సైనికులని రోజూ రెండు పూటలా రొట్టెలు పెట్టడానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది మన దగ్గర.
అంత డబ్బు లేదని సంతకాలు పెట్టించుకోని వదిలేసింది ఇందిర!
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది! మోడీ లక్ష్యం కేవలం ఉగ్రవాదులు, సైనిక స్థావరాలు మాత్రమే! పాకిస్తాన్ ప్రజలు కాదు!
Share this Article