Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

AI రోబో స్నిప్పర్… ప్రపంచాన్ని నివ్వెరపరిచిన పర్‌ఫెక్ట్ మర్డర్…

June 20, 2025 by M S R

.

[ రమణ కొంటికర్ల ] …. ఇప్పుడు ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం తారస్థాయికి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ ను అత్యాధునిక సాధనా సంపత్తి కల్గిన దేశంగా చాలామంది భావిస్తున్న వేళ… ఆ ఇజ్రాయెల్ నే గడగడలాడించిన ఓ ఇరానీ గురించి ఓసారి చెప్పుకోవచ్చు. ఆయన్ను సింపుల్ గా ఇరాన్ రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే పిలుస్తారంటే.. ఆ న్యూక్లియర్ మాస్టర్ మైండ్ ఎంతగా ఇజ్రాయెల్ ను వణికించిందో చెప్పే కథ ఇది…

మొహ్సిన్ ఫఖ్రీజాదే… ఈయన ఇరాన్ అణుపితామహుడు. అక్కడి న్యూక్లియర్ ప్రోగ్రామ్ కు ఫాంటమ్ లాంటివాడు. చాలాకాలంపాటు ఈయనెవరో కనిపించలేదు, వినిపించలేదు. కానీ, అమెరికాతో పాటు, ఇజ్రాయెల్ వంటి ప్రాశ్చాత్యా దేశాల్లోని ఇంటలిజెన్స్ వ్యవస్థలకు మాత్రం మొహ్సిన్ ఫఖ్రీజాదే ఓ విస్మరించలేని వ్యక్తి. వారికి నిద్రలేని రాత్రులు మిగిల్చిన న్యూక్లియర్ సైంటిస్ట్.

Ads

దాదాపు 2018లోనే ఇజ్రాయెల్ మొహ్సిన్ ఫఖ్రీజాదేను లక్ష్యంగా చేసుకుంది. ఆ పేరెప్పుడూ గుర్తుంచుకోవాల్సిందేనంటూ నెతాన్యాహూ ప్రకటన!

2018లో ఇరాన్ అణుపత్రాలను రహస్యంగా దొంగిలించిన ఇజ్రాయెల్ నాడు టెలివిజన్స్ లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ఆ అణుపత్రాలను యూదు జాతీయులకు చూపిస్తూ.. ఇదిగోండి ఇదీ గుర్తుంచుకోవాల్సిన పేరంటూ మొహ్సిన్ ఫఖ్రీజాదే గురించి చేసిన ప్రకటన ఆయనను ఇజ్రాయెల్ ఎంతగా టార్గెట్ చేసిందో చెప్పేది.

2000 సంవత్సరం ప్రారంభంలోనే ‘ప్రాజెక్ట్ అమద్’ పేరుతో ఫఖ్రీజాదే ఇరాన్ రహస్య అణ్వాయుధ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడన్నదే పాశ్చాత్య నిఘావర్గాల విశ్వాసం. 2015లో ఒక అణు ఒప్పందం జరిగినప్పుడు మాత్రం తన పేరు అప్పటికే న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ లో ప్రత్యర్థి దేశాల నిఘా వర్గాల్లో నానుతున్నప్పటికీ… ఎందుకోగానీ ఆ సమయంలో ప్రస్తావనకు రాలేదు. అప్పుడే దాని వెనుక ఏవైనా వ్యూహముందా అనే అనుమానాలకు తెరలేచింది.

బహిరంగంగా ఎక్కడా కనిపించని, వినిపించని ఓ అజ్ఞాత అణ్వాయుధ శాస్త్రవేత్తైన మొహ్సిన్ పేరు కేవలం పాశ్చాత్య భద్రతా దళాల దృష్టిలో మాత్రం ఉంది. అలా నిఘా వర్గాలు ఆయన కోసం వెంటాడుతూ, వేటను కొనసాగించాయి.

nuc scientist

ఊహించని రీతిలో హత్యకు కుట్ర!

అది 2020, నవంబర్ 27వ తేదీ… ఫఖ్రీజాదే తన భార్యతో పాటు… తన భద్రతా కాన్వాయ్ తో టెహ్రాన్ లోని తూర్పున ఉన్న అబ్సార్డ్ లోని వారి విల్లాకు తన కారులో బయల్దేరాడు. అలా ప్రయాణిస్తున్న క్రమంలో ఓ స్పీడ్ బ్రేకర్ అడ్డు తగిలింది. అదిగో అక్కడే వ్యక్తులెవ్వరూ లేని ఓ ట్రక్ కనిపించింది.

ఆ ట్రక్కు లోపల 7.62 ఎంఎం బెల్జియన్ FN MAG మెషిన్ గన్ ఉంది. సరిగ్గా టార్గెట్ ను ఫేషియల్ రికగ్నిషన్ తో గుర్తించి కాల్పులు జరిపేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వ్యవస్థను ఆ ట్రక్కులో ఏర్పాటు చేశారు. టార్గెట్ ఫోటోను స్కాన్ చేసి పెడితే చాలు ఆ లక్ష్యాన్ని గురి చూసి కొట్టే ఏఐ టెక్నాలజీని ఆ ట్రక్కులో అమర్చారు.

దాంతోపాటే, ఆ ట్రక్కులో పేలుడు పదార్థాలనూ ఉంచారు. మొత్తం సాటిలైట్ ద్వారా ఏజెంట్స్ ఎవ్వరూ అవసరంలేని పూర్తి మానవ రహిత ఆపరేటింగ్ సిస్టమ్ తో ఆ ట్రక్కును సిద్ధం చేశారు. పైగా దాని రిమోట్ సిస్టం కూడా ఇరాన్ బయట నుంచి ఆపరేట్ చేసేంత శక్తి సామర్థ్యాలు, సాంకేతికతతో కూడినవని ఆ తర్వాత ఇరాన్ భద్రతా అధికారులు గుర్తించారు.

సరిగ్గా ఎక్కడైతే ఫఖ్రీజాదే కారు స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో అయిందో.. అక్కడే ఓ కుక్క రోడ్డు దాటుతున్న సమయంలో ఆ ట్రక్కులోంచి కాల్పులు మొదలయ్యాయి. మొదట ఫఖ్రీజాదే ప్రయాణిస్తున్న కారు ముందు భాగం, ఆ తర్వాత విండ్ షీల్డ్ పై కాల్పుల మోత మోగింది. ఫఖ్రీజాదే భుజానికి బుల్లెట్ తగిలింది.

తప్పించుకుని కారు డోర్ వెనుక దాక్కునే యత్నం చేస్తుండగా మరో మూడు రౌండ్ల కాల్పులతో పదిహేను బుల్లెట్ల దాడికి ఫఖ్రీజాదే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కానీ, ఆయన భార్యకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.

ఒక్క నిమిషంలోపే 15 బుల్లెట్స్ పేలాయి. ఆ తర్వాత మానవ రహిత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ట్రక్కు పూర్తిగా పేలిపోయింది. ఆ ట్రక్కుకు సంబంధించిన విడిభాగాలు ప్రత్యర్థులు ప్లాన్ చేసినట్టుగా పూర్తిగా దగ్ధం కాకపోవడంతో.. ఆ తర్వాత ఇరాన్ అధికారులు వాటి ఆనవాళ్లను స్వాధీనపర్చుకున్నారు. మొత్తంగా ఫఖ్రీజాదేది సర్వసాధారణ హత్య కాదని తేల్చారు. రోబోట్ స్నిప్పర్ గా పిల్చే సాధనా సంపత్తి ద్వారా ఫఖ్రీజాదే మర్డర్ కు స్కెచ్ కు వేసినట్టు గుర్తించారు.

iran nuc scientist

హత్య వెనుక మొస్సాద్ కుట్ర!

ఫఖ్రీజాదే హత్య జరిగిన తీరును మొస్సాద్ సైలెంట్ సిగ్నేచర్ గా ఆ తర్వాత కొన్ని కథనాలు అభివర్ణించాయి. అయితే, జెరూసలేం మాత్రం ఎన్నడూ కూడా ఫఖ్రీజాదే హత్యను తామే చేశామని మాత్రం అంగీకరించనప్పటికీ… మొస్సాద్ మాజీ చీఫ్ యోస్సీ కోహెన్ ఆ తర్వాత ఇచ్చిన హింట్ తో ఫఖ్రీజాదే మర్డర్ చేసింది ఇజ్రాయిలేనని ప్రపంచానికి అర్థమైపోయింది. ఫఖ్రీజాదే చట్టబద్దమైన తమ లక్ష్యమంటూ ఆయన పేర్కొన్న తీరు ఆయనపై ఇజ్రాయెల్ ఎంత ఫోకస్ చేసిందే చెప్పేది.

ఇరాన్ అణుపితామహుడైన ఫఖ్రీజాదేను మట్టుబెట్టడానికి ఇజ్రాయిల్ ఎంతో కష్టించాల్సి వచ్చింది. తమ ఆయుధ సంపత్తిని ఇరాన్ లోకి అక్రమంగా రవాణా చేసి, స్థానికంగా సమీకరించినవీ కలుపుకుని మొదట అక్కడ పరీక్షించి చూశారు. దాడికి ముందు ఫఖ్రీజాదే నిత్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఒక రెక్కీ నిర్వహించారు మొస్సాద్ ఏజెంట్స్.

మొస్సాద్ ప్రయోగించిన ఫేస్ రికగ్నిషన్ ఆర్టిఫిషియన్ ఇంటలిజెన్స్ కు చెందిన సాంకేతికత ఎంత కచ్చితత్వంతో పనిచేసిందో ఆ తర్వాత ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన బ్రిగేడియర్ జనరల్ అలీ ఫడావీ వెల్లడించాడు.

రోబోట్ స్నిప్పర్ కాల్పుల్లో ఫఖ్రీజాదే మాత్రమే టార్గెట్ తప్ప.. ఆయన భార్యకుగానీ, ఆయన గార్డ్స్ కుగానీ ఎలాంటి చిన్న గాయాలు కూడా కాకపోవడాన్ని ఆయన మీడియాతో ఉటంకించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ అసాధారణ వ్యక్తిని టార్గెట్ చేసి… మరింత అసాధారణమైన రీతిలో ఆధునిక చరిత్రలోనే అధునాతనమైన ఏఐ టెక్నాలజీతో చేసిన మొట్టమొదటి హత్యగా కూడా ఫఖ్రీజాదే మర్డర్ నేర రికార్డుల్లో ఓ హిస్టరీనే.

అంతేకాదు, భవిష్యత్తు యుద్ధాల్లో టార్గెట్స్ ను డీకొట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఎలా ఉపయోగించబోతున్నారో చెప్పడానికి కూడా ఫఖ్రీజాదే హత్య ఓ ఉదాహరణగా చర్చకు తెరలేపింది.

క్షిపణి దాడుల్లో ఫెరిడౌన్ అబ్బాసీ మృతితో మళ్లీ తెరపైకి ఫఖ్రీజాదే మర్డర్ చర్చ!

ఇటీవల ఇజ్రాయెల్ క్షిపణుల దాడిలో ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ మాజీ అధిపతి ఫెరిడౌన్ అబ్బాసీ మరణించడంతో… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఫేస్ రికగ్నిషన్ తో జరిగిన ఫఖ్రీజాదే మర్డర్ కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చల్లోకొచ్చింది. తన దేశం అడగాలేగానీ అణ్వాయుధాలను మరింత ఉత్సాహంగా తయారుచేస్తాననే ప్రకటన చేసి.. అంతర్జాతీయ సమాజానికి తాము అణుపరీక్షలకు సిద్ధమనే ఓ సూచనను కూడా చేశాడు ఫెరిడౌన్ అబ్బాసీ.

అయితే, ఫఖ్రీజాదే మర్డర్ తర్వాత ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య మరింత శత్రుత్వం పెరుగుతూ వచ్చింది. దౌత్యపరమైన చర్చలు ఇక పట్టాలు తప్పడం మొదలుపెట్టాయి. ఇరాన్ కూడా తన యురేనియం శుద్ధిని మరింత వేగవంతం చేసింది. ఫఖ్రీజాదే హత్యతో ఇరాన్ మద్దతుదారులైన తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై మరింత తిరుగుబాటు ప్రదర్శించడం ప్రారంభమైంది.

అణువైఖరి మరింత కఠినంగా అవలంబించారు. అంతర్జాతీయంగా కూడా చర్చలకు ఆస్కారం లేకుండా పోయింది. అలా ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య యుద్ధమేఘాాలు కమ్ముకుంటూ వచ్చాయి. ఫఖ్రీజాదే హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి ఇరాన్ నరనరాన నిండిపోయింది.

తాజాగా వైమానిక క్షిపణుల దాడిలో మరణించిన ఫెరిడౌన్ అబ్బాసీ మరణంతో ఫఖ్రీజాదే మర్డర్ కేసు తెరపైకి రావడమే కాదు.. అసలు ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య ఇంతలా వైషమ్యాలు పెరిగిపోవడానికి ఫఖ్రీజాదే హత్య కూడా ఎలా కారణమైందో కూడా చర్చకు పెట్టింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనితర సాధ్యమైన ఆద్యకళకు ఏది గుర్తింపు..? ఏది పట్టింపు..?!
  • 8 వసంతాలు… కంప్లీట్ అనంతిక షో… కానీ మేఘసందేశం రోజులు కావివి..!!
  • పెట్టుడు జనన ముహూర్తాలు నమ్ముతారా..? ఈ కథ చదవాలి మీరు..!!
  • ఆ భీకరమైన శబ్దం విని, భయపడి, ఆ లింక్ నొక్కారో… అయిపోయారు..!!
  • పెట్టుడు ముహూర్తాల్లో కృత్రిమ జననాలు జాతకాలను మారుస్తాయా..?!
  • బనకచర్ల ప్లాన్ బద్దలు… చంద్రబాబు ప్రణాళికలపై రేవంత్ పాశుపతం..!!
  • ఫాఫం కొనఊపిరి… పరుచూరి డైలాగుల దెబ్బకు వెంఠనే హరీమంది రోజా…
  • భేష్ శేఖర్ కమ్ముల… కుబేర ఓ క్లీన్ హిట్… ఆకట్టిపడేశావు పలు సీన్లలో…
  • ఇవి మాయ ఉంగరాలు కావు… మహత్తులూ ఉండవు… జస్ట్, స్మార్ట్ రింగ్స్…
  • ‘‘ఎందుకింత ఎక్కువ ఆయుష్షునిచ్చావ్ దేవుడా…? ఏడవడానికా..!’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions