.
Srini Journalist …. ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణల రక్తాశ్రువుల మధ్య, దేశ రక్షణే శ్వాసగా బతికిన ఒక యువ ఐబీ అధికారి అంకిత్ శర్మను మత ఉన్మాద మూక ఎంతటి కసితో, కిరాతకంగా అంతమొందించిందో న్యాయస్థానం నిన్న వెలువరించిన తీర్పుతో స్పష్టమైంది.
2020 ఫిబ్రవరి 25న దేశ రాజధాని వీధుల్లో పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై జరిగిన తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత కుట్రల వల్లే ఈ ఘోరకలి జరిగిందని, కేవలం హిందువు కావడం వల్లే ఆ నిరాయుధ దేశభక్తుడిని మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ నేతృత్వంలోని గుంపు పొట్టనబెట్టుకుందని కోర్టు సాక్ష్యాలతో సహా నిర్ధారించింది.
Ads
ఆ రోజు సాయంత్రం తన విధులను ముగించుకుని ఇంటికి తిరిగొస్తున్న 26 ఏళ్ల అంకిత్ శర్మ, చాంద్ బాగ్ పులియా వద్ద చెలరేగుతున్న అల్లర్లను చూసి, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, దేశభక్తుడిగా ఆ గుంపును శాంతింపజేయడానికి, గొడవలను ఆపడానికి ప్రయత్నించడమే ఆయన చేసిన ఏకైక పాపమైంది.
ఉన్మాదంతో ఊగిపోతున్న ఆ గుంపు ఆయన్ను బలవంతంగా తాహిర్ హుస్సేన్ కార్యాలయం వైపు లాక్కెళ్లి, శత్రువుపై కూడా చూపనంత కసితో ఆయన శరీరంపై ఏకంగా 51 కి పైగా పదునైన కత్తులతో, ఆయుధాలతో పొడిచి, సాక్ష్యాలను నాశనం చేసేందుకు మురికి కాలువలో పడేసిన తీరు సమాజాన్నే నివ్వెరపరిచింది.

ఈ దారుణ నరమేధానికి అసలు మూలాలు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిఎఎ చట్టం చుట్టూ అల్లిన తప్పుడు ప్రచారంలోనే ఉన్నాయి; షాహీన్ బాగ్, ఈశాన్య ఢిల్లీలోని ముస్లిం వర్గాలను కొందరు స్వార్థపూరిత శక్తులు తీవ్రంగా తప్పుదోవ పట్టించి, ఈ చట్టం వల్ల ముస్లింల పౌరసత్వం పోతుందనే అపోహలను సృష్టించి వారిలో భయానక అభద్రతా భావాన్ని, విద్వేషాన్ని నూరిపోశాయి.
వాస్తవానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో మతపరమైన వేధింపులకు గురై భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే సిఎఎ యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప, ఏ ఒక్క భారతీయ ముస్లిం పౌరసత్వాన్ని తొలగించే చట్టం కాదనే నిజాన్ని దాచిపెట్టి జనాలను రెచ్చగొట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటిస్తున్న సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను దెబ్బతీయాలనే అంతర్జాతీయ కుట్రతో, తాహిర్ హుస్సేన్ వంటి స్థానిక నేతలు తమ ఇళ్లపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ ప్యాకెట్లు, రాళ్లు ముందే సిద్ధం చేసుకుని ఈ మత ఘర్షణలకు తెరతీశారు.
దేశ రక్షణే శ్వాసగా బతికిన మన ఐబీ అధికారి అంకిత్ శర్మ చేసిన పవిత్ర త్యాగం ఎన్నటికీ వృథా పోదు. ఆనాడు మత ఉన్మాదంతో ఊగిపోయిన కిరాతక గుంపు మన దేశభక్తుడిపై 51 సార్లు కత్తితో దాడి చేసినప్పుడు తల్లడిల్లిన భారతీయ హృదయం సాక్షిగా, ఢిల్లీలోని కర్కర్దూమా న్యాయస్థానం నేడు ధర్మాన్ని నిలబెట్టింది.
శాంతిని నెలకొల్పబోయి ప్రాణాలర్పించిన ఆ నిరాయుధ వీరుడి ఆత్మకు, విద్వేష ముఠాను దోషులుగా తేల్చిన ఈ చారిత్రాత్మక కోర్టు తీర్పుతోనే అసలైన న్యాయం చేకూరింది. దేశద్రోహ కుట్రలు, మత పిచ్చి, చట్టం ముందు ఎప్పటికైనా మోకరిల్లాల్సిందేనని, భారత సార్వభౌమాధికారానికి ఎవరైనా తలవంచాల్సిందేనని ఈ తీర్పు లౌడ్ అండ్ క్లియర్గా చాటిచెప్పింది.
.
ఆప్ కేజ్రీవాల్ ప్రతి అడుగు, ప్రతి అనుచరుడు, ప్రతి చేష్ట ప్రమాదకరమే… మరోసారి నిరూపితమైంది!!
Share this Article