.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు… బీజేపీ హైకమాండ్ పూర్తిగా పక్కనపెట్టిన నాయకుడు అన్నామలై వ్యవహారం ఇంకా సస్పెన్స్… తను రాజీనామా చేయడానికే ఢిల్లీ వెళ్లాడు… తమిళనాట బీజేపీ వైఖరి తనకు నచ్చడం లేదు… అసలు తమిళ రాజకీయాలే బీజేపీకి అర్థం కావడం లేదు, ఇక తంటాలు, అవమానాలు దేనికని… మొదట ఓ జాతీయవాద ఉద్యమం మొదలుపెట్టి, తరువాత ఓ ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు పోవాలనేది తన ప్లాన్…
బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిశాడు, రాజీనామా పత్రం ఇచ్చాడు, తరువాత అమిత్ షాను కలిశాడు, తనే కదా పార్టీ వ్యవహారాల కీలకస్థానం… బీఎల్ సంతోష్ను కలిశాడు… కానీ ఇంకా రాజీనామాకు ఆమోదం లభించలేదు… బుజ్జగిస్తున్నారు… ఆర్ఎస్ఎస్ ముఖ్యులను కూడా ఢిల్లీకి రప్పించారు… మాట్లాడుతున్నారు, రేపో, ఈ సాయంత్రమో మోదీని కూడా కలవనున్నట్టు వార్తలు..,
Ads
అంతా బీట్ అరౌండ్ ది బుష్… అంటే అసలు విషయం తేలకుండా, ఏదో కాలయాపన చేయడం..! తమిళనాడులో అన్నామలై ఖచ్చితంగా బీజేపీకి కాస్త జోష్ తీసుకొచ్చాడు… కానీ తనకు పార్టీలోనే పెద్ద వ్యతిరేకవర్గం, ఇన్నేళ్లూ వాళ్లదే తమిళ బీజేపీ మీద ఆధిపత్యం, వాళ్లు ఉద్దరించేది లేదు, అన్నామలై కాళ్లలో కట్టెలు పెట్టడం తప్ప…
వాళ్లు ప్రస్తుత అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్, తమిళిసై… అదొక వర్గం… అన్నామలై కాదని, నైనార్ పేరు కూడా పళనిస్వామి సూచించాడని అంటారు… (తెలంగాణలో బండి సంజయ్ను తీసేసిన తీరుగానే)… అన్నామలై అంటే పడదు వాళ్లకు… అన్నామలైని పార్టీలోనే కొనసాగేలా చేసినా… వాళ్లు పడనిస్తారా..? రోజూ తలనొప్పులే… ఈ ముగ్గురినీ ఇప్పుడు ఢిల్లీకి పిలిపించారు అర్జెంటుగా…
అసలు సమస్య పళనిస్వామి… అన్నాడీఎంకేతో పొత్తు… ఇప్పటికిప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోలేదు అన్నామలై కోసం… పళనిస్వామి అన్నామలైని సహించడు… ఇవీ అసలు సమస్యలు… తమిళిసై గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, గత లోకసభ ఎన్నికల నుంచే ఈమెకూ అన్నామలైకీ పడటం లేదు… కోల్డ్ వార్… ఆమె ఏమైనా ఉద్దరించే స్థితిలో ఉందా..? జీరో…
2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానైనా సరే జాతీయవాద ఎజెండాతో దూసుకెళ్లాలని, ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడాలని అన్నామలై భావించాడు… అది కుదరలేదు, మరి ఇప్పుడు అన్నా మలైని రిటెయిన్ చేసుకోవడం (పార్టీలో ఉంచుకోవడం) అమిత్ షా, మోదీ ద్వయానికి పెద్ద సవాలే… ఎందుకంటే అన్నామలై కేవలం పదవి కోసం ఆశపడే వ్యక్తి కాదు, దానికి ఆయన ఐపీఎస్ ఉద్యోగాన్నే వదిలేశాడు… కాబట్టి ఆయనను బుజ్జగించడానికి కేంద్ర నాయకత్వం మూడు ప్రధాన హామీలను టేబుల్ మీద పెట్టినట్లు సమాచారం…
– ఇకపై తమిళనాడు బీజేపీలో సీనియర్ల పెత్తనం చెల్లకుండా, అన్నామలై చెప్పిందే వేదంగా సాగేలా “ఫ్రీ హ్యాండ్” ఇవ్వడం… నైనార్ నాగేంద్రన్, తమిళిసై, వనతి వంటి సీనియర్లకు ఢిల్లీ నుంచే గట్టి వార్నింగ్ ఇచ్చి, స్టేట్ యూనియన్లో అన్నామలై వ్యూహాలకు అడ్డురాకుండా చేయడం…
– ఇప్పుడు విజయ్ గెలిచినా, తమిళనాడులో పాత ద్రావిడ శకం (DMK/AIADMK) ముగింపు దశకు వచ్చింది… తదుపరి టార్గెట్ మనదే” అని అన్నామలైకి నచ్చజెప్పడం… పార్లమెంట్ ఎన్నికల నాటికి తమిళనాడులో అన్నాడీఎంకేతో సంబంధం లేకుండా ఒంటరిగా ఎదిగేలా, పార్టీ ఓటు బ్యాంకుని పెంచే పూర్తి బాధ్యత ఆయనకే అప్పగించడం…
– అవసరమైతే ఆయనకు జాతీయ స్థాయిలో లేదా కేంద్ర క్యాబినెట్లో కీలక బాధ్యతలు ఇవ్వడం, లేదంటే తమిళనాడులో సరికొత్త క్యాడర్ను ఆయనే స్వంతంగా రిక్రూట్ చేసుకునేలా సంస్థాగత మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం…
ఢిల్లీ పెద్దలు అన్నామలైని వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేరు… ఎందుకంటే తమిళనాడులో బీజేపీకి కాస్తో కూస్తో క్రేజ్ తెచ్చింది ఆయనే… పొత్తుల విషయంలో జరిగిన తప్పును ఒప్పుకుంటూనే, భవిష్యత్తు తమిళనాడును అన్నామలై చేతుల్లో పెట్టడమే ఏకైక మార్గమని అమిత్ షా భావిస్తున్నాడుె… భేటీ తర్వాత అన్నామలై నిర్ణయం ఎలా ఉండబోతున్నదో..!
Share this Article