.
ప్రస్తుతం గౌహతిలోని కామాఖ్య శక్తిపీఠంలో దున్నపోతుల బలి పూజ జరగడం లేదు… ఈమధ్య మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఈ పూజల కోసం వెళ్తున్నారు కదా, అందుకోసం ఈ క్లారిటీ… ఈనెల 17 వరకూ అంతే…
ప్రముఖ జ్యోతిష్కుడు, వామాచార పూజలు నిర్వర్తించే వేణుస్వామి ఇస్తున్న మరింత స్పష్టత ఏమిటంటే..? గుడిని మొత్తం మూసేసే అంబుబాచీ సమయంలో ఏ బలిపూజలూ ఉండవు… జూన్లో ఆ మూడు రోజులు అయిపోయాయి, ఆ మేళా అయిపోయింది… ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే..?
Ads
ప్రతి సంవత్సరం నిర్వహించబడే అత్యంత విలక్షణమైన, ఆధ్యాత్మిక పండుగే “మానస పూజ, దేవధ్వని (Deodhani) మేళా ఇప్పుడు జరుగుతోంది… “ధియోధని” అనేది వాస్తవానికి అస్సామీ సంప్రదాయంలో “దేవధ్వని” (లేదా దియోధని / Deodhani) ఉత్సవాన్ని సూచిస్తుంది… 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలు…

ఈ పండుగ రోజుల్లో నాగుల దేవత అయిన మా మానస దేవికి ఆలయంలోని నత్మందిర్ (మధ్య భాగం) లో ప్రత్యేక మానస పూజలు నిర్వహిస్తారు… దేవధ్వని (Deodhani) నృత్యం అనేది ఓ సంప్రదాయిక, మార్మిక, ఆధ్యాత్మిక నృత్యం… ఈ ఉత్సవంలో పాల్గొనే నృత్యకారులను ‘దేవదాస్’ లేదా ‘దియోధా’ అంటారు… వీరు పూజల సమయంలో దైవిక శక్తులు ఆవహించినట్లుగా (పూనకం వచ్చినట్లు) తీవ్రమైన ఆధ్యాత్మిక స్థితిలోకి (Trance) వెళ్తారు…

పూనకంలో ఉన్న వీరు చేతిలో కత్తులు, డాలు లేదా కర్రలు పట్టుకుని, డప్పులు, తాళాల శబ్దాలకు అనుగుణంగా ఉధృతంగా నృత్యం చేస్తారు. కొన్నిసార్లు పదునైన కత్తి అంచులపై కూడా నిలబడి నృత్యం చేయడం వీరి ప్రత్యేకత. గిరిజన, తాంత్రిక సంప్రదాయాల కలయికతో జరిగే ఈ పండుగను చూడటానికి దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు కామాఖ్య దేవాలయానికి తరలివస్తారు…
ఈ ఉత్సవం తరువాత నీలాంచల్ (కామాఖ్య కొలువైన గుట్ట) మీద ఉండే ప్రతి ఇంట్లో మేకను బలి ఇస్తారు… 17 వరకు కూడా చిన్న చిన్న గుళ్లల్లో మేకలు, ఇతర బలిపూజలు జరుగుతాయి, ప్రధాన దేవాలయంలోనూ ఈ బలిపూజలు జరుగుతాయి, కానీ దున్నపోతు బలి మాత్రం నిలిపివేస్తారు… 17 తరువాత యథావిధిగా అన్ని పూజలూ ఉంటాయి’’
Share this Article