.
ప్రస్తుతం వుమెన్ టీ20 వరల్డ్ కప్ నడుస్తోంది కదా… మొన్న నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచులో మన తెలుగమ్మాయి SriCharani ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించింది… వికెట్లు తీయడంలో, రన్స్ ఎక్కువగా ఇవ్వకోవడంలో ఆమె ఆటతీరు గమనిస్తున్న వారందరికీ ఓ తాజా వార్త పెద్ద ఆశ్చర్యం ఏమీ కలిగించలేదు… అది ఆమె ఐసీసీ వుమెన్ క్రికెటర్ల ర్యాంకింగులో నంబర్ వన్ ప్లేసులో నిలిచింది!
వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒక సాధారణ గ్రామం నుంచి వచ్చి, కేవలం ఏడాది కాలంలోనే ప్రపంచ క్రికెట్ శిఖరాన్ని అధిరోహించడం అంటే మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ సంచలనం, ఎడమచేతి వాటం ఆర్థడాక్స్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
Ads
21 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్ స్పిన్ త్రయాన్ని వెనక్కి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించడం తెలుగు రాష్ట్రాలకే కాకుండా, యావత్ భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే ఒక అధ్యాయం.
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో శ్రీ చరణి బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాటర్లకు పీడకలగా మారింది. కేవలం మూడు మ్యాచ్లలోనే 10 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దూసుకుపోతోంది.
నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించిన శ్రీ చరణి, ఆ మ్యాచ్లో మొత్తం 4 వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చింది. ఆ తర్వాత మాంచెస్టర్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ 3 వికెట్లతో రాణించి తన ఫామ్ను నిరూపించుకుంది.
ఈ నిలకడైన ప్రదర్శనతో ఇప్పటివరకు నంబర్ 1 స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్ను మూడో స్థానానికి నెట్టేసి, శ్రీ చరణి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుత ర్యాంకింగ్స్లో చార్లీ డీన్ రెండో స్థానంలో, సోఫీ ఎకిల్స్టోన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.
కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం, ఎర్రమలపల్లె గ్రామానికి చెందిన ఆమె, తండ్రి చంద్రశేఖర్ రెడ్డి (రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉద్యోగి) ప్రోత్సాహంతో మొదట బ్యాడ్మింటన్, ఖో-ఖో ఆడింది. ఆ తర్వాత క్రికెట్ వైపు అడుగులు వేసి, అసాధారణ ప్రతిభతో డొమెస్టిక్లో ఆంధ్రా జట్టుకు, ఆపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికైంది.
గత ఏడాది జూన్ 2025లో ఇంగ్లాండ్పై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన శ్రీ చరణి, తొలి మ్యాచ్లోనే 4 వికెట్లు తీసి శ్రవంతి నాయుడు తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. అంతేకాదు, గత ఏడాది భారత్ గెలుచుకున్న 2025 వన్డే ప్రపంచకప్ విజేత జట్టులోనూ ఆమె కీలక పాత్ర పోషించింది.
శ్రీ చరణి అగ్రస్థానంతో పాటు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో భారత ఇతర ఆటగాళ్లు కూడా మెరుగైన స్థానాలు సాధించారు: బౌలింగ్ శ్రీ చరణి నెం. 1, బ్యాటింగ్ షఫాలీ వర్మ ఆరో స్థానం (6), బ్యాటింగ్ హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్) పదో స్థానం (10) … ఎందుకోగానీ స్మృతిమందాన వెనుకబడిపోయింది!!
A monumental milestone! 🔝
Sree Charani’s wicket-taking form takes her to the summit of the ICC Women’s T20I Bowling Rankings for the very first time 1️⃣👏#TeamIndia | #WomenInBlue | #T20WorldCup pic.twitter.com/K0TE8h26mH
— BCCI Women (@BCCIWomen) June 23, 2026
Share this Article