.
కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి, గోదావరి నీటిని ఎత్తిపోయండి, ఏమీ కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతులకు ద్రోహం వంటి బాధ్యతారహిత విమర్శల్ని, డిమాండ్లును ప్రతిపక్షాలు నెత్తికెత్తుతున్న తీరును మనం గతంలోనే చెప్పుకున్నాం… NDSA కూడా అంగీకరించదు, ఆ బరాజుల దగ్గర ఏమాత్రం నీటి నిల్వ చేసినా, అవి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్న మాట… పంపింగ్ చేయాలంటే ఎంతోకొంత నీటి నిల్వ కూడా అవసరం… సో, అసాధ్యంకన్నా ఇక్కడ ప్రమాదం అనేదే ప్రధానమైన అంశం…
అంటే… ప్రతిపక్షాల ట్రాపులో పడితే మొదటికే మోసం… ఎల్లంపల్లికి ఇన్ఫ్లో వరకు ఆగడమే శరణ్యం… ఈ సందర్భంగా ఓ కీలకమైన ఉదాహరణ చెప్పుకుందాం… అది అవసరం కూడా… ఆ ఉదాహరణ పేరు తీస్తా-3 … మేడిగడ్డతో ఆటలాడితే ఏం ప్రమాదమో చెప్పడానికి ఈ వివరాల్లోకి వెళ్లాలి ఓసారి…
Ads
తీస్తా-3 ఒక హెచ్చరిక.. మేడిగడ్డతో ఆటలా? ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు! …. Teesta-III Dam … NDA అధికారంలో ఉన్న సిక్కిం రాష్ట్రంలో అక్టోబర్ 2023 లో ఈ డ్యాంకు ప్రమాదం… 2017 లో ప్రారంభించిన డ్యాం 2023 వరదకు పూర్తిగా కొట్టుకుపోయింది… 1,200 మెగావాట్ల హైడల్ ప్లాంటు సహా ఆ భారీ ఆనకట్ట వరద నీటికి కొట్టుకుపోయింది.

100 మందికి పైగా చనిపోయారు … 70 మందికి పైగా ఆచూకీ తెలయకుండా పోయారు… 2 వేలకు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి… 4 జిల్లాలు ఎఫెక్ట్ అయ్యాయి… ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణం ప్రారంభించాల్సి వచ్చింది… రిపేర్లకూ నో చాన్స్… ఆ పనులు సాగుతున్నాయి… బహుశా 2028 వరకు పూర్తి కావచ్చునేమో… విశేషం- విషాదం ఏమిటో తెలుసా…? డ్యామ్ నిర్మాణ వ్యయంతో సమానంగా ఇప్పుడు మళ్లీ ఖర్చు పెట్టాల్సి వస్తోంది… ఈ పనుల్లో ఎల్అండ్టీ భాగస్వామి…
- అవును, మేడిగడ్డ రిపేర్లకు మొరాయిస్తున్న అదే ఎల్అండ్టీ కంపెనీ!! ఈ వినాశనం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే—”ప్రకృతిని ఎదిరించి లేదా బలహీనమైన నిర్మాణాలపై భారీ అంచనాలతో పందెం కాయొద్దు…”

ఈ పాఠాన్ని ఇప్పుడు మనం తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విషయంలో గుర్తు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది….
తీస్తా-3 ఒక వార్నింగ్ బెల్
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే— ఒక ఆనకట్ట విఫలమైతే, అది కేవలం ఆ ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాదు, అది ఒక గొలుసుకట్టు విపత్తుకు (Cascading Failure) దారితీస్తుంది. తీస్తా నది తీరాన జరిగిన వినాశనం, కాళేశ్వరం బ్యారేజీల విషయంలో జరగబోయే అనర్థాలకు ఒక ట్రైలర్ లాంటిది… హెచ్చరికలాంటిది…

మేడిగడ్డ.. మళ్ళీ పంపింగ్ ఆశలా?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఇప్పటికే కుంగిపోయాయి, బలహీనపడ్డాయి. పునాదులు కదిలిన ఈ బ్యారేజీల మీద సుందిళ్ల ద్వారా నీటిని నిల్వ చేయడం, కన్నెపల్లి పంపింగ్ స్టేషన్ ద్వారా పంపింగ్ మొదలుపెట్టడం అంటే… ప్రాణాలతో చెలగాటమాడటమే. బలహీనంగా ఉన్న కట్టడాలపై నీటి ఒత్తిడి (Hydrostatic pressure) పెంచితే, అది ఏ క్షణంలో ఏ రూపాన్ని తీసుకుంటుందో ఎవరూ ఊహించలేరు.
భద్రాచలం దాకా ముప్పు.. విలయం తప్పదా?
కాళేశ్వరం బ్యారేజీలు కేవలం కాంక్రీటు కట్టడాలు కావు. అవి గొలుసుకట్టు వలె అనుసంధానించబడి ఉన్నాయి. మేడిగడ్డ గనుక పూర్తిగా కుప్పకూలితే, ఆ ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. గోదావరి నది ప్రవాహం, దిగువన ఉన్న భద్రాచలం వరకు కల్లోలం సృష్టిస్తుంది. లక్షలాది క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా దిగువకు దూకితే, అది సృష్టించే విలయం ఎంత ఉంటుందో ఊహించడం కూడా భయంకరంగా ఉంది.

అసాధ్యమైన పునర్నిర్మాణం – అనివార్యమైన జాగ్రత్త
నిజమే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్యారేజీలను పూర్తిగా కూల్చి మళ్ళీ కొత్తగా నిర్మించడం ఆర్థికంగా అసాధ్యం, రాజకీయంగా అంతకంటే కష్టం. కానీ, “ఏం కాదులే” అని కళ్లు మూసుకుని పంపింగ్ మొదలుపెడితే, భవిష్యత్తులో వచ్చే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
తీస్తా-3 విషయంలో మనం ఏం చూశామంటే— ఆనకట్ట గేట్లు తెరవలేకపోయినా, ఇంజనీరింగ్ డిజైన్ సరిగ్గా లేకపోయినా ప్రకృతి చూపించే ప్రతాపం ఎలా ఉంటుందో చూశాం. కాళేశ్వరం బ్యారేజీల విషయంలో మనకు డిజైన్ లోపాలు, కుంగిపోయిన పునాదుల రూపంలో ఇప్పటికే ‘రెడ్ సిగ్నల్స్’ కనిపిస్తున్నాయి.

అభివృద్ధి కావాలి, సాగునీరు అందాలి.. కానీ ఆ కల నిజం కావాలంటే ముందు ప్రజల ప్రాణాలు భద్రంగా ఉండాలి. పంపింగ్ అనే ఆశ కోసం, పునాదులు లేని కోటలపై నీటిని నిల్వ చేసే సాహసం చేయకండి. తీస్తా-3 ఘటన ఒక హెచ్చరిక మాత్రమే, వినాశనం సంభవించాక విలపించడం కంటే, ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడమే అసలైన పరిపాలనా దక్షత. సో, మేడిగడ్డ… తొందరపడకండి… ప్రాణాలతో ఆటలాడకండి..!

Share this Article