Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా రాజ్యాధికారాన్ని శాసించదు… శాసించగలమనే భ్రమల్లో ఉంటుంది…

April 11, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. నాయకురాలు . మరో ఎర్ర సినిమా . ప్రజల సమస్యలను ఎత్తి చూపి , రాజకీయ నాయకుల సంఘ విద్రోహుల ఆగడాలను ఉతికి ఆరేయటమే పత్రికల పని అని నమ్మే వ్యక్తి బోస్ పాత్రలో రంగనాథ్ . పత్రిక పేరు జనశక్తి . ఆయన భార్య శారద సాదాసీదా గృహిణి , భయస్తురాలు . పత్రిక స్థాయి నుండి ఓ ప్రాంతీయ పార్టీ జనశక్తి పార్టీని ప్రారంభించే స్థాయికి ఎదుగుతాడు రంగనాథ్ .

(మీడియా రాజ్యాధికారాన్ని శాసించదు, కానీ శాసిస్తామనే భ్రమల్లో ఉంటుంది… సరే, అప్పట్లో ఇలాంటి కథలు చాలా వచ్చేవి సినిమాల్లో)… ఇదంతా గిట్టని స్థానిక మంత్రి గారు , అతని చెంచాలు రంగనాథుని నడిరోడ్డు మీదే మీటింగ్ వేదిక మీదే హత్య చేస్తారు . చనిపోయిన భర్త ఆశయాల కొరకు భార్య జనని పాత్రలో శారద రంగం లోకి వస్తుంది . ఆమె పత్రికను మార్కెట్ లోకి రాకుండా , ప్రజలు కొనకుండా రాజకీయులు రుబాబు చేస్తుంటారు .

Ads

ఆమె తన తెలివితేటలతో చేయని నేరాలకు జైలు శిక్ష అనుభవిస్తున్న నలుగురు యువకులను సద్ప్రవర్తన ఆధారంగా బయటకు తీసుకుని వస్తుంది . ఆ నలుగురు యువకులను కన్విన్స్ చేసి తన పత్రికకు రక్షకులుగా మారుస్తుంది . జనశక్తి పార్టీ పెద్దల అభ్యర్ధన మేరకు పార్టీకి నాయకురాలు అవుతుంది . క్లైమాక్సులో రాజకీయులతో ఘర్షణ , నలుగురు యువకులు చనిపోవటం , శారద ముఖ్యమంత్రి కావటంతో సినిమా ముగుస్తుంది .

సత్యారెడ్డి ఈ సినిమాకు కధను అందించటమే కాకుండా స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని దర్శకత్వం వహించారు . సామాజిక స్పృహ ఉన్న సినిమాలను దర్శకత్వం వహించిన ఈయన ప్రస్తుతం హాలీవుడ్లో కింగ్ బుధ్ధ అనే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారని ఎక్కడో చదివాను .

శారద ఎప్పటిలాగే బాగా నటించింది . నలుగురు యువకులుగా భానుచందర్ , ఆహుతి ప్రసాద్ , సాయికిరణ్ , నాగబాబు నటించారు . ఆ నలుగురితో పాటు కవిగా కాళిదాసు అనే నూతన నటుడిని పరిచయం చేసారు . ఈ సినిమాకు మాటల్ని వ్రాసిన గణేష్ పాత్రో దూరదర్శన్ అధికారిగా ఓ అతిధి పాత్రలో కూడా కనిపిస్తారు .

మంత్రిగా మరో నూతన నటుడు ఆదిత్య కుమార్ , చెంచాగా మా గుంటూరు వారయిన జయప్రకాష్ రెడ్డి , ఇతర పాత్రల్లో సీత , పి జె శర్మ , భీమేశ్వరరావు  తదితరులు నటించారు . రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో వందే మాతరం ఇది మా నవతరం పాట బాగా హిట్టయింది .

సీతను తమ ఊహల్లో ఊహించుకుంటూ నలుగురు యువకులు పాడుకునే పాటలో సీత డాన్స్ అందంగా ఉంటుంది . దర్శకుడు సత్యారెడ్డి కళాత్మకంగా తీసాడు ఈ పాటను . వెన్నెలకంటి పాటల్ని వ్రాయగా వాటిని మాధవపెధ్ది రమేష్ , జానకమ్మ , మనో , రాధిక పాడారు .

హింసా దౌర్జన్యాలతో కాకుండా అహింసాయుత మార్గంలో గాంధీగిరి ద్వారానే ఫలితం ఉంటుందనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినా సినిమాంతానికి అన్ని సినిమాలలాగానే హింసతో ముగుస్తుంది . మొత్తం మీద ఈ ఎర్ర సినిమా సినిమా ప్రియులకు చూడబులే . స్క్రీన్ ప్లేని బిర్రుగా చేసుకుని ఉంటే మంచి సినిమా అయి ఉండేదేమో ! సినిమా యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు ట్రై చేయవచ్చు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సుప్రీం కోర్టు ఆ తీర్పు… మీనాక్షి నటరాజన్ కేసులో కీలకం..?!
  • ఆ ధర్మస్థల కుట్రదారుల్ని సమాజం ఏం శిక్షించగలిగింది..!?
  • ఈ పిశాచిని ఈ న్యాయవ్యవస్థ శిక్షించగలదా..? ఎవ్వడూ నమ్మడు..?!
  • వర్తమాన రాజకీయాల్లో విజయశాంతి ‘ఆశయం’ నెరవేరేనా..?
  • కాంగ్రెస్‌లో నిమజ్జనం..? కర్మ ఎదురుతన్నడం అంటే ఇదే మరి..!!
  • ప్రత్యేక వర్గం, సొంత కుంపటీ కుదరవు… బీజేపీలో విలీనమే దిక్కు…
  • మోడీ తరువాత ఎవరు..? ఓ కొత్త బ్లూ ప్రింట్ సిద్ధమైపోతోందా..?!
  • ఈ ‘జాగీర్దారు’ ఇంకా గోకుతూనే ఉన్నాడు తెలంగాణ సమాజాన్ని..!!
  • ఈయన్ని ఇంకాస్త డిఫరెంటుగా, లోతుగా అర్థం చేసుకుందాం ఇలా…!
  • భేష్ సింగరేణి… తవ్వి వదిలేయలేదు… పచ్చగా ప్రకృతికి తిరిగి అప్పగింత…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions