.
“అప్పుడు ప్రజాస్వామ్యానికి ముప్పు… ఇప్పుడు పరిపాలనా నిర్ణయమా?” బెంగాల్లో BJPపై విరుచుకుపడిన కాంగ్రెస్, ఇప్పుడు కేరళలో అదే ఆరోపణల మధ్య ఇరుక్కుందా? West Bengal రాజకీయాల్లో తీవ్రంగా విమర్శించిన వ్యవహారం, కొన్నేళ్లకు తానే చేయాల్సి వస్తే దాన్నే “hypocrisy trap” అంటారు. ప్రస్తుతం Kerala లో చెలరేగిన వివాదం కూడా అదే కోణంలో చర్చకు వస్తోంది.
కేరళ ప్రస్తుత Chief Electoral Officer అయిన IAS అధికారి రతన్ యు. కెల్కర్ను, ముఖ్యమంత్రి V. D. Satheesan కార్యదర్శిగా నియమించాలనే నిర్ణయం రాజకీయంగా దుమారం రేపుతోంది. కారణం — ఇదే తరహా వ్యవహారంపై గతంలో బెంగాల్లో కాంగ్రెస్, TMC కలిసి BJPపై తీవ్ర ఆరోపణలు చేయడమే.
Ads
బెంగాల్లో ఏమైంది? గతంలో Suvendu Adhikari కు అత్యంత కీలక పరిపాలనా స్థానంలో మాజీ ఎన్నికల అధికారి నియామకం జరిగినప్పుడు, కాంగ్రెస్- TMC పెద్ద ఎత్తున విమర్శించాయి. ఎన్నికల ప్రక్రియను, వోట్ రివిజన్ను పర్యవేక్షించిన అధికారులకు తర్వాత రాజకీయంగా కీలక బాధ్యతలు ఇవ్వడం అంటే అది “reward posting” అని ఆరోపించాయి… సువేందు అధికారి తీసుకొచ్చిన ఆ అధికారి పేరు Subrata Gupta…
ఆయన గతంలో ఎన్నికల కమిషన్ తరఫున West Bengal Special Intensive Revision (SIR) ప్రక్రియకు Special Roll Observerగా పనిచేశాడు… తర్వాత Suvendu Adhikari ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనను Adviserగా నియమించారు… ఇదే నియామకంపై కాంగ్రెస్, TMC తీవ్ర విమర్శలు చేశాయి…
అప్పట్లో ముఖ్యంగా Rahul Gandhi ఎన్నికల వ్యవస్థ స్వతంత్రత గురించి పెద్ద ఎత్తున మాట్లాడాడు… ఎన్నికల అధికారుల neutrality దెబ్బతింటోందని, ఇలాంటి నియామకాలు ప్రజాస్వామ్యంపై అనుమానాలు పెంచుతాయని వ్యాఖ్యానించాడు…
అంటే అప్పటి వాదన స్పష్టంగా ఇలా ఉండేది… ‘‘ఎన్నికల నిర్వహణ చేసిన అధికారులు తర్వాత రాజకీయ శిబిరాలకు దగ్గరయ్యే పోస్టుల్లోకి వెళ్తే impartiality పై సందేహాలు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. ఇది వ్యవస్థను రాజకీయంగా ప్రభావితం చేసే ప్రమాదకర ధోరణి’’
ఇప్పుడు కేరళలో?
ఇప్పుడు అదే తరహా పరిస్థితి కేరళలో కనిపిస్తోంది. రతన్ యు. కెల్కర్ను సీఎం VD సతీశన్ కార్యదర్శిగా తీసుకోవడం రాజకీయంగా భారీ చర్చకు దారి తీసింది… BJP, CPM సహా ప్రత్యర్థులు ఒకే ప్రశ్న వేస్తున్నారు…
“బెంగాల్లో అయితే ప్రజాస్వామ్యానికి ముప్పు… కేరళలో అయితే సాధారణ పరిపాలనా నిర్ణయమా?” అంటే చర్య ఒక్కటే. మారింది కేవలం పార్టీ మాత్రమే అన్న వాదన వినిపిస్తోంది.
కేరళ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఇది పూర్తిగా సాధారణ పరిపాలనా నియామకమని చెబుతున్నాయి. IAS అధికారులు ప్రభుత్వ సేవలో భాగమని, ఎన్నికల బాధ్యతలు ముగిశాక ఇతర పోస్టుల్లో పనిచేయడం సహజమని, దీనిని రాజకీయ rewardగా చూపించడం తగదని అంటున్నాయి. కానీ సమస్య “చట్టబద్ధత” కాదు… “consistency”… ఈ వివాదంలో కీలక అంశం legality కాదు. రాజకీయ consistency…
ఎందుకంటే…. ఒకప్పుడు ఇదే వ్యవహారాన్ని ప్రజాస్వామ్యానికి ముప్పుగా అభివర్ణించిన పార్టీ, ఇప్పుడు అదే తరహా నిర్ణయాన్ని సాధారణ పరిపాలనా ప్రక్రియగా సమర్థిస్తోంది. దీంతో ప్రతిపక్షాలకు బలమైన ఆయుధం దొరికింది. “Selective outrage”, “double standards”, “political convenience” వంటి పదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి…
ఈ మొత్తం వివాదం మరో పెద్ద ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఎన్నికల అధికారుల స్వతంత్రత అంటే… అది కేవలం ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ముఖ్యమా? లేక అన్ని పార్టీలకు ఒకే ప్రమాణం ఉండాలా? ఎందుకంటే ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబడేది కేవలం చట్టాలతో కాదు — impartiality కనిపించాలి కూడా.
అందుకే ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల అధికారులకు cooling-off period ఉండాలా?
ఎన్నికల తర్వాత వెంటనే రాజకీయ లేదా సున్నితమైన పోస్టుల్లోకి వెళ్లకుండా నిబంధనలు అవసరమా?
అనే చర్చలు జరుగుతుంటాయి.
అందుకే ఇప్పుడు కాంగ్రెస్పై వస్తున్న ప్రధాన విమర్శ ఒక్కటే… “అదే పని BJP చేస్తే ప్రజాస్వామ్య హత్య… అదే పని తమవాళ్లు చేస్తే పరిపాలనా అవసరమా?” ఈ వివాదం కేవలం ఒక అధికారిని నియమించడంపై కాదు. భారత రాజకీయాల్లో “principles vs political convenience” అనే శాశ్వత చర్చను మరోసారి ముందుకు తెచ్చింది.
Share this Article