.
చంద్రబాబు బనకచర్ల ప్రణాళికలకు అడ్డంగా మరో ట్విస్టు… ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన పలు టెక్నికల్, లీగల్, పొలిటికల్ ప్రశ్నలకు, కొత్త ప్రతిపాదనలకు ఠారెత్తిపోయిన చంద్రబాబుకు ప్రస్తుతం చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చక్రం అడ్డం వేస్తున్నాడు…
ఈ ట్విస్టు పేరు మావోయిస్టులు… ఆశ్చర్యంగా ఉందా..? మోకాలికీ బట్టతలకూ లంకెలాగా ఉన్నట్టు అనిపిస్తోందా..? కానీ నిజమే… సింపుల్గా చెప్పాలంటే… చత్తీస్గఢ్ ప్రభుత్వం 49 వేల కోట్ల ఖర్చుతో రెండు భారీ ప్రాజెక్టులను సంకల్పించింది…
Ads
1) బోధ్ఘాట్ ప్రాజెక్టు… 2) మహానది- ఇంద్రావతి లింక్… ఈ రెండూ పూర్తయితే దాదాపు 17 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది… పుష్కలంగా జలవిద్యుత్తు… రిజర్వాయర్లలో చేపల పెంపకం… తాగునీరు… ఇవన్నీ ఎక్కడో తెలుసా..?
బస్తర్, దంతెవాడ, సుక్మ తదితర జిల్లాలు… అంటే మావోయిస్టుల ప్రాబల్యం బలంగా ఉన్న ప్రాంతాలు… ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ సహా కీలక నేతలను హతమారుస్తూ అప్పర్ హ్యాండ్ సాధించి, త్వరలో ఏకంగా మావోయిస్టు పార్టీనే తుడిచిపెడతాను అని చెబుతుండవచ్చుగాక…
కానీ కేవలం పోలీసు బలగాలతో ఆ సమస్యను పరిష్కరించలేం, ఆ జిల్లాలను, ప్రత్యేకించి అటవీ ప్రాంతాలను డెవలప్ చేయడం ద్వారా మాత్రమే మావోయిస్టు పార్టీకి చెక్ పెట్టాలనే అభిప్రాయం చాన్నాళ్లుగా ఉన్నదే… లక్షలాది గిరిజనాన్ని కొత్త ఉపాధి వైపు మళ్లించి, ఆ ప్రాంతాలను డెవలప్ చేస్తే సహజంగానే మావోయిస్టు సమస్య పరిష్కృతం అవుతుందనేది ఆ భావనల సారాంశం…
సో వాట్, మంచిదే కదా అంటారా..? ఇక్కడే ఓ తిరకాసు ఉంది… గోదావరిలో ప్రాణహిత తరువాత వచ్చి చేరే, కలిసే ప్రధాన ఉపనదులేమీ లేవు… దిగువన ఉన్న ఇంద్రావతే ముఖ్యం… దానిపై ప్రాజెక్టులు కట్టి, మహానదితో కూడా ఇంద్రావతిని లింక్ చేశాక… వందల టీఎంసీల నీరు గోదావరిలోకి రాకుండా పోతుంది… వృథాగా సముద్రంలో కలవకుండా ఇలా ప్రయోజన వినియోగం మంచిదే…
కానీ ఎప్పుడైతే నీటి లభ్యత తగ్గుతుందో… ప్రత్యేకించి చంద్రబాబు చెప్పే వరద జలాలు తగ్గుతాయో… ఇక బనకచర్ల ప్రాజెక్టే నిరర్థకం అవుతుంది… మరిక దాని లాభదాయకతను ఎలా చూపించగలడు చంద్రబాబు..? చంద్రబాబు మీద మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉండవచ్చుగాక… కానీ చత్తీస్గఢ్లో డెవలప్మెంట్ చేసి చూపిస్తే తప్ప మళ్లీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా ఆపలేరు…
2023 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న భూపేష్ భాగల్ బోధ్ఘాట్ ప్రాజెక్టు మీద బాగా శ్రద్ధ చూపించాడు… కానీ అనేక గిరిజన ఆవాసాలు ఖాళీ చేయించాలి, ముంపు సమస్య… ఆందోళనలు… సరిగ్గా టాకిల్ చేయలేకపోయాడు… కేంద్రం నుంచీ పెద్దగా సహకారం అందలేదు… దాంతో వెనక్కి తగ్గాడు, కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం దాని మీద కాన్సంట్రేట్ చేస్తోంది…
సీఎం విష్ణుదేవ్ సాయి పీఎం మోడీని ఈమధ్యే కలిసి ఈ రెండు ప్రాజెక్టులపై చర్చించాడు… మోడీ గో ఎహెడ్ అన్నాడు… మహానదితో ఇంద్రావతి అనుసంధానం అంటే… మహానదితో గోదావరి… పోలవరం నుంచి కృష్ణా అనుసంధానం జరుగుతున్నట్టే…
కాదూ, ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా ప్రయోజలం
దక్కాలంటే ఇచ్చంపల్లి- సాగర్ లింక్… ఇక బనకచర్లకు నీళ్లేవి చంద్రబాబు గారూ…!! మరో ఏపీ కాళేశ్వరం కడితే అది నిజంగా ఎవరి కోసం..? ఇది మేఘా సంస్థ తన కోసం, మీకోసం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టు కాదు కదా కొంపదీసి..!?
Share this Article