.
న్యూ చండీగఢ్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టును ప్రకటించారు… వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు… జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి… మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ , హర్ష్ దుబేలకు తొలిసారిగా జట్టులో చోటు లభించింది…
కానీ ఇదేదో న్యూ గుజరాత్ ఐపీఎల్ టీమ్లా అనిపిస్తోంది… 15 మందిలో ఏడుగురు గుజరాత్ టైటాన్స్ వాళ్లే…
7 out of 15 are from GT… సిరాజ్, వాషింగ్టన్ సుందర్ వోకే… వీలయితే భువనేశ్వర్ను తీసుకుని ఉండాల్సిందేమో… బలమైన బ్యాటింగు జట్టులా కనిపిస్తోంది… టెస్టు మ్యాచును కూడా ఐపీఎల్ మ్యాచులా ట్రీట్ చేస్తున్నట్టుంది చూడబోతే… పదీపదకొండు మందీ బ్యాటర్లే…
Ads

జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత వన్డే జట్టు …. ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ , హర్ష్ దుబే వన్డే జట్టులోకి తొలిసారిగా పిలుపు అందుకున్నారు…

వేర్వేరు కెప్టెన్లు ఎందుకులే అనుకుని గిల్కే టెస్ట్, వన్డే బాధ్యతలు… వన్డే జట్టుకు శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్… బాగుంది… కానీ అర్షదీప్ సింగ్ అస్సలు ఫామ్లో లేడు, తన బదులుగా టెస్టు జట్టుకు తీసుకున్న సిరాజ్నే ఇక్కడా కంటిన్యూ చేయాల్సిందేమో… హార్దిక్ పాండ్యాకు చోటు కొంత విస్మయకరమే… సూర్యకుమార్ యాదవ్ ఉండబోడని ఊహించిందే…
ఇదీ ప్రధానంగా బ్యాటింగ్ కోణంలో కూర్చిన జట్టులాగే కనిపిస్తోంది… కోహ్లీ, రోహిత్ సహా దాదాపు 10-11 మంది ఉతుకుడు బ్యాచే… స్థూలంగా ఒకటీరెండు అసంతృప్తులు మినహా మిగతా కూర్పు బాగానే ఉంది…
Share this Article