.
పాలకుడికి మానవతా ధోరణి ఉండాలి… అది ప్రభుత్వ తప్పిదం కావచ్చు, ప్రకృతి విపత్తు కావచ్చు… ఎవరికైనా నష్టం వాటిల్లితే వెంటనే స్పందించి ఆదుకునే హృదయం ఉండాలి…. రేవంత్ రెడ్డి దాన్ని చాటుకున్నాడు… అది అవసరం కూడా…
ఎందుకంటే..? ఇలాంటి సందర్భాల్లో, ప్రత్యేకించి రైతులు పంటల్ని తమ తప్పిదం లేకుండా నష్టపోయే సందర్భాల్లో వెంటనే ప్రభుత్వం అండగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజలకు, అధికారులకు ఇవ్వడానికి పాలకుడి స్పందన ఉపకరిస్తుంది… అది అధికారగణానికి ఓ డైరెక్షన్…
Ads
విషయం ఏమిటంటే… నిర్మల్ మండలంలో షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని ఎకరాల్లో వరి, ప్రత్యేకించి మొక్కజొన్న పొలాలు అక్షరాలా కాలిపోయాయి… కాలిపోయిన మక్క కంకుల్ని ఏరుకుంటూ మహిళలు ఏడుస్తున్న సీన్లు పొద్దుణ్నుంచీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి… నిజంగా చేతికొచ్చిన పంట కాలిపోతే అంతకన్నా విషాదం ఏముంటుంది..? అన్నదాతకు తనకు తోడుగా ఉన్న పశువులైనా, చేతికొచ్చిన పంటయినా బిడ్డలతో సమానం కదా…
అవి రేవంత్ రెడ్డి కంటబడ్డాయి… టైమ్కు తమ దృష్టికి తీసుకుపోయిన తన టీమ్ను మెచ్చుకోవాలి… వెంటనే ఆ రైతుల నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, తగిన పరిహారాలు, ఆర్థికసాయం అందించేలా సదరు జిల్లా కలెక్టర్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించాడు… గుడ్…
ముందే చెప్పినట్టు… ఇలాంటివి ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తాయి… సమయానికి స్పందిండిరా బాబూ అని అధికారగణానికి ఇలాంటివి ఆదేశాలు కావు, శాసనాలు… అంతేకాదు, ఆ లోకల్ నాయకులకూ ‘ఇలాంటి విపత్తుల్లో జిల్లా యంత్రాంగంతో కోఆర్డినేట్ చేసుకుని, రిలీఫ్ ఇప్పించండి’ అనే సంకేతాల్ని ఇచ్చినట్టు లెక్క..!!
Share this Article