Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రజా సమస్యలపై సినిమాలు తీసినా అసలు చూసేవాడు ఎవడున్నాడు..!

March 7, 2024 by Rishi

నిన్న హీరో గోపీచంద్ మీద ఒక స్టోరీ చెప్పుకున్నాం మనమే… ఇప్పుడున్న దర్శకుల్లో ఎందరు ప్రజా సమస్యల మీద అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారని తను చేసిన వ్యాఖ్యల మీద… ఇన్నేళ్లు టీ కృష్ణ కొడుకుగా నువ్వు చేసిన పీపుల్స్ మూవీ ఒక్కటైనా ఉందా అని అడిగాం, అవి తీసే నిర్మాతలు ఎవరున్నారని అడిగాం…

దీనికి నిర్మాత, రచయిత, దర్శకుడు Dr ప్రభాకర్ జైని మరో కోణంలో ఆన్సర్ ఇచ్చాడు… అసలు ఆ సినిమాలు తీస్తే చూసేవారు ఎవరు అని అడుగుతున్నాడు… తన మాటల్లో చెప్పాలంటే…



“సార్! దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

(1) తెలుగులో థియేటర్లలో సినిమాలు చూసే వారి వయసు 15 నుండి 35 సంవత్సరాలు. వీళ్ళే ప్రస్తుత తెలుగు సినిమా నిర్మాతల, దర్శకుల targetted audience. వీళ్ళకు సమాజం పట్ల బాధ్యత లేదు. సామాజిక సమస్యల గురించి వారికి తెలియదు.

(2) ఎందుకంటే, ఇప్పుడు యువతీయువకుల దృష్టి అంతా సంపాదన మీద, సుఖాల మీద, కార్ల మీద, బైకుల మీదా ఉంది. అందుకే, నానా కష్టపడి, ఐటీ ఉద్యోగం సంపాదించుకుని, అమెరికాలో పడడం, లేదా హైటెక్ సిటీలో పడడం.

(3) ఇందుకు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది.

(4) 20, 25 ఏళ్ళ వయసులో నెలకు, లక్షల్లో జీతాలు రావడంతో సుఖాలకు, డ్రగ్సుకు, పబ్బులకు అలవాటు పడుతున్నారు. వీళ్ళకు ఐదు రోజులు పని, రెండ్రోజుల లగ్జరీ.

(5) హైదరాబాదు నగరంలోనే కొన్ని లక్షల మంది యువతీయువకులు సహజీవనం చేస్తున్నారు.

(6) ఇటువంటి యువత, సమాజ శ్రేయస్సు కోసం తీసే సినిమాలు, ఏడుపులు, దరిద్రం తాండవించే సినిమాలు, దేశభక్తిని పెంపొందించే సినిమాలు చూస్తారా?

(7) మొన్నటికి మొన్న ‘సలార్’ సినిమా విడుదలయిన సమయంలోనే ‘సామ్ బహదూర్’ అని జనరల్ మానెక్ షా జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా వచ్చింది. సలార్ వేల కోట్లకు పరిగెడుతుంటే, ‘సామ్’ సినిమాకు వంద కోట్లు రాయడానికే గగనమయింది.

(8) ఇది సమాజంలో వస్తున్న విపరీత పోకడలకు నిదర్శనం. మన యువతీయువకులు అత్యధికంగా ఫోన్లో చూసేవి బూతు సినిమాలే. (తిన్నామా, తాగామా, పన్నామా, తెల్లారిందా…)

(9) సినిమా హీరోహీరోయిన్లే డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతుంటే, వాళ్ళను ఆదర్శంగా తీసుకుని, మన రాష్ట్రం ‘ఉడ్తా పంజాబ్’ లాగా ‘ఉడ్తా తెలంగాణా’; ‘ఉడ్తా ఏపీ’ లుగా మారాయి. గ్రామగ్రామానికి డ్రగ్స్ చేరిపోయాయి. మొన్న హైదరాబాదు సీపీ ప్రెస్ మీటులో మాట్లాడుతూ గత సంవత్సరమే, తెలంగాణా రాష్ట్రంలో 28000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్టు చెప్పారు. దొరకనివి అంతకు వంద రెట్లు ఉంటాయి.

ఇప్పుడు చెప్పండి, గోపీచంద్ లేదా మరో హీరో  దేశభక్తి సినిమాలు గానీ, సామాజిక సమస్యల సినిమాలు గానీ తీస్తే, ఈ మాత్రం కూడా చూడరు.

నిజమే, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలన్నీ అభూత కల్పనలే. అబద్ధాల పుట్టలే.

ఇటువంటి సినిమాలు ఓ ఇరవై కోట్లలో తీస్తారు. హీరో, డైరెక్టర్ కలిసి పది కోట్లు పంచుకుంటారు. సినిమా దరిద్రంగా ఉన్నా థియేటర్లు, ఆడియో కంపెనీలు, ottలు, టీవీ ఛానెళ్ళకు అమ్ముకోవడం వల్ల ఓ ఐదు కోట్ల వరకైనా లాభం వస్తుంది. చాలు కదా? దేశం, సమాజం సంకనాకిపోతే ఎవరికేంటి?”

Ads



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions